తెలంగాణ నుంచి బీజేపీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలంగాణ నుంచి బీజేపీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Last Updated : Mar 21, 2019, 11:33 PM IST
తెలంగాణ నుంచి బీజేపీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాల నుంచి బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థులకు సంబంధించిన జాబితాను కేంద్రమంత్రి జేపీ నడ్డా విడుదల చేశారు. తెలంగాణలో బీజేపీ మాజీ అధ్యక్షుడైన కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ స్థానం కేటాయించిన బీజేపీ.. నిన్ననే పార్టీలో చేరిన మాజీ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణకు మహబూబ్‌నగర్ టికేట్ కేటాయించింది. ఇప్పటివరకు మంత్రి జేపీ నడ్డా వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణ నుంచి ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగనున్న పలువురు నేతల వివరాలు ఇలా వున్నాయి.

సికింద్రాబాద్ : కిషన్ రెడ్డి
మల్కాజ్‌గిరి : ఎన్. రామచందర్ రావు
మహబూబ్‌నగర్ : డీకె అరుణ
నాగర్‌కర్నూలు : బంగారు శృతి
నల్లగొండ : గార్లపాటి జితేంద్ర కుమార్
భువనగిరి : పీవీ శ్యాం సుందర్ రావు
నిజామాబాద్ : అరవింద్
కరీంనగర్ : బండి సంజయ్
వరంగల్ : చింతా సాంబమూర్తి
మహబూబాబాద్ : జాటోతు హుస్సేన్ నాయక్

Trending News