ఆర్టీసీ సమ్మె: సీఎం కేసీఆర్‌కి కోదండరామ్ సూటి ప్రశ్న

సీఎం కేసీఆర్‌కి కోదండరామ్ సూటి ప్రశ్న

Last Updated : Oct 18, 2019, 10:17 AM IST
ఆర్టీసీ సమ్మె: సీఎం కేసీఆర్‌కి కోదండరామ్ సూటి ప్రశ్న

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మొదటి నుంచీ మద్దతు పలుకుతున్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కేసీఆర్ తప్ప ఎవరూ కారణం కాదని అన్నారు. కార్మికుల సమ్మె విజయవంతమయ్యేందుకు తెలంగాణ సమాజం మొత్తం అండగా నిలుస్తుందని.. కేసీఆర్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు యావత్ తెలంగాణ సమాజం ఏకమవుతోందని హెచ్చరించారు. ''ఆంధ్రా పాలకులనే తరిమికొట్టిన మనకు కేసీఆర్ మెడలు వంచడం పెద్ద పనేం కాదు'' అంటూ కార్మికులకు కోదండరాం ధైర్యం చెప్పారు. ఈ నెల 19న కార్మికులు చేపట్టిన తెలంగాణ బంద్‌కు అందరూ సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేసిన కోదండరాం.. ''ఆర్టీసీ నష్టాల్లో ఉందంటూ పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ ఏడాది ప్రభుత్వ ఆదాయం ఎందుకు పడిపోయిందో సమాధానం చెప్పాలి'' అని సూటిగా ప్రశ్నించారు. ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తలకు రాష్ట్రాన్ని దోచిపెడుతూ కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు.

Trending News