ఆసుపత్రుల్లో పుట్టిన శిశువుకు వెంటనే ఆధార్

ఆధార్ నమోదులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే టీఎస్-సర్కార్ కొత్త విధానం అమలులోకి తెచ్చింది. 

Last Updated : Jan 8, 2018, 01:18 PM IST
ఆసుపత్రుల్లో పుట్టిన శిశువుకు వెంటనే ఆధార్

ఆధార్ నమోదులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం సాధించింది. ఈ నేపథ్యంలోనే టీఎస్-సర్కార్ కొత్త విధానం అమలులోకి తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రం(బర్త్ సర్టిఫికెట్)తో పాటు ఆధార్ కార్డు అందజేయనుంది సర్కార్.

జీహెచ్ఎంసీ ఈ-గవర్నెన్స్‌లో భాగంగా ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది. పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత ఓ తల్లిపిల్లల ఆసుపత్రిలో అమలుచేయగా.. విజయవంతమైంది. దాంతో మిగితా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ విధానం తీసుకురావాలని యోచిస్తోంది. ఈ పథకాన్ని ప్రైవేట్ ఆసుపత్రులు వ్యతిరేకిస్తున్నాయి. దీనికోసం పరికరాలు, అదనపు సిబ్బందిని నియమించాల్సి వస్తుందని.. పెనుభారం అవుతుందని భావిస్తున్నాయి. అయితే అధికారులు వీరితో చర్చలు జరుపుతున్నారు.  జీహెచ్ఎంసీ పరిధిలోని 25 ఆసుపత్రుల్లో మరికొన్ని రోజుల్లోనే ఈ పథకం అమలులోకి వస్తుంది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసేందుకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఆలోచిస్తోంది.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x