పంచాయితీ పోల్స్: ఏకంగా అభ్యర్ధి ఓటు గల్లంతు !!

తెలంగాణ పంచాయితీ పోరులో  విచిత్ర ఘటన

Last Updated : Jan 25, 2019, 11:42 AM IST
పంచాయితీ పోల్స్: ఏకంగా అభ్యర్ధి ఓటు గల్లంతు !!

తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి జిల్లా చెంచుపల్లి మండలం బదావంత్ తండా నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధి ఓటు గల్లంతు అయింది . ఓటు వేయడానికి వస్తే లిస్ట్ లో  తన పేరు లేదని అధికారులు చెప్పడంతో ఆమె షాక్ కు గురైంది. ఈ విషయాన్ని మీడియా ముందు వెల్లడించిన ఆమె..ఈసీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించింది. తన ఓటును కావాలనే తొలగించారని..ఇందులో ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నేతల హస్తం ఉందని ఆమె ఈ సందర్భంగా  ఆరోపించింది
 

Trending News