All in One News: ఆల్ ఇన్ వన్ న్యూస్..!

All in One News: సమూల వార్త సమాహారం ఆల్‌ ఇన్ వన్ న్యూస్..

  • Zee Media Bureau
  • Sep 4, 2022, 03:14 PM IST

All in One News: లంగాణలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విస్తృతంగా పర్యటించారు. హైదరాబాద్‌లో రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ద్రాద్రి  కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శిశువుతోపాటు గర్భిణీ మృతి చెందింది. డెలివరీ సమయంలో సరైన వైద్యం అందకే శిశువు మృతి చెందినట్లు బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. గర్భిణి పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు చనిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News