Podubhoomi disputes Bhadradri Kothagudem District: పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళకు గాయాలయ్యాయి. ఈ భూములను మా తాతల కాలం నుంచి సాగుచేకుంటున్నామని గిరిజనులు అన్నారు. తరచూ అటవీ శాఖ అధికారులు తమపై దాడులు చేస్తున్నారని వారు ఆరోపించారు. దుక్కిదున్నే నాగళ్లను వారు తీసుకెళ్తున్నారని వాపోయారు. ఇలాంటి చర్యలకుపాల్పడుతున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Podubhoomi disputes: పోడు భూముల విషయమై గిరిజనులకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ