Lebanon Blast: మళ్లీ అగ్ని ప్రమాదం..కార్యాలయాల్నిఖాళీ చేయిస్తున్న ఆర్మీ

లెబనాన్ రాజధాని నగరం బీరూట్ లో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోర్టులో జరిగిన భారీ పేలుళ్ల ఘటన మర్చిపోకముందే మళ్లీ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది.

Last Updated : Sep 10, 2020, 09:55 PM IST
Lebanon Blast: మళ్లీ అగ్ని ప్రమాదం..కార్యాలయాల్నిఖాళీ చేయిస్తున్న ఆర్మీ

లెబనాన్ ( lebanon ) రాజధాని నగరం బీరూట్ లో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోర్టులో జరిగిన భారీ పేలుళ్ల ఘటన మర్చిపోకముందే మళ్లీ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది.

ఆగస్టు 4వ తేదీన లెబనాన్ రాజధాని బీరూట్ ( Beerut blast ) లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. పోర్టు ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్  లో పేలుడు సంభవించడంతో 191 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. చుట్టుపక్కల భవంతులన్నీ పూర్తిగా ధ్వంసమై...స్మశానంగా మారిపోయింది. ఈ ఘటన ప్రపంచమంతా ఉలిక్కిపడేలా చేసింది. వేలాది మంది నిరాశ్రయులు కాగా..ఇంకా శిధిలాల తొలగింపు కొనసాగుతూనే ఉంది.

ఈ సంఘటన నుంచి తేరుకోకముందే అదే ప్రాంతంలో మళ్లీ అగ్నిప్రమాదం ( Another fire accident ) చెలరేగింది. భారీగా మంటలు రావడంతో ఈ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. ఆయిల్, టైర్లు నిల్వ ఉంచిన గోడౌన్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపట్టి లెబనాన్ ఆర్మీ హెలికాప్టర్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పోర్టు సమీపంలోని కార్యాలయాలను ఖాళీ చేయాల్సిందిగా లెబనాన్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. Also read: India-Japan: రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం

Trending News