పాక్‌ ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి!

పాక్‌ ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి! 

Last Updated : Feb 17, 2019, 11:41 PM IST
పాక్‌ ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి!

న్యూఢిల్లీ: చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ మార్గంలో పాకిస్తాన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. బలూచిస్తాన్‌లోని తుర్బట్‌ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో 9 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ దాడికి బాధ్యత వహిస్తూ బలుచ్ రజి అజోయి సంగర్ (BRAS) అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ, బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌, బలోచ్‌ రిపబ్లికన్‌ గార్డ్‌ అనే మూడు సంస్థల కలిసి బీఆర్ఏఎస్ పేరిట ఓ దళంగా ఏర్పడి తమ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 

సౌదీ అరేబియా రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పాకిస్తాన్ చేరుకోవడానికి కొన్ని గంటల ముందే చోటుచేసుకున్న ఈ ఆత్మాహుతి దాడి అనేక ప్రశ్నలకు తావిచ్చింది.

Trending News