Nobel Prize in Literature: సాహిత్య రంగంలో టాంజానియా నవలా రచయితకు నోబెల్

Abdulrazak Gurnah: టాంజానియా నవలా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నాకు సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారం లభించింది. తన రచనల్లో శరణార్ధుల కష్టాలను గర్నా ప్రతిబింబించారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2021, 06:48 PM IST
  • వలసవాదంపై రాజీలేని పోరాటం
  • శరణార్థుల కష్టాలను రచనల ద్వారా చెప్పిన గుర్నా
  • బ్రిటన్‌కు వలసవచ్చి ఫ్రొసెసర్‌గా బాధ్యతలు
Nobel Prize in Literature: సాహిత్య రంగంలో టాంజానియా నవలా రచయితకు నోబెల్

Nobel Prize in Literature: సాహిత్యంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి(Nobel prize) టాంజానియా నవలా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నా(Abdulrazak Gurnah)ను వరించింది. వలసవాదం(colonialism)పై ఆయన రాజీలేని పోరాటంతో పాటు, శరణార్థుల(refugees) వ్యథను కళ్లకు కట్టినందుకు గానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది. 

టాంజానియా(Tanzanian) జాంజిబార్‌లో 1948లో జన్మించిన అబ్దుల్ రజాక్ గర్నా.. 1960వ దశకంలో బ్రిటన్‌కు శరణార్ధిగా వచ్చారు. 1963లో బ్రిటిష్‌ వలస పాలన నుంచి జాంజిబర్‌(Zanzibar) స్వాతంత్ర్యం పొంది టాంజానియాలో భాగంగా మారింది. అయితే ఆ తర్వాత అధ్యక్షుడు అబిద్‌ కరుమే పాలనలో అరబ్‌ జాతీయులపై వివక్ష పెరగడమే గాక, వారి ఊచకోతలు జరిగాయి. గుర్నా కూడా ఇదే అరబ్ వర్గానికి చెందిన వారే. దీంతో తన భవిష్యత్తు కోసం ఈ అరాచక పాలన నుంచి విముక్తి పొందడం కోసం కుటుంబాన్ని, దేశాన్ని విడిచి ఇంగ్లాండ్‌కు వచ్చేశారు. అప్పటికి ఆయన వయసు 18ఏళ్లే. ఆ తర్వాత ఇంగ్లాండ్‌(england)లోనే ఉన్నత విద్యను అభ్యసించి. కేంట్రబెరీలోని కెంట్‌ యూనివర్శిటీలో సాహిత్య ప్రొఫెసర్‌(Professor of Literature)గా పనిచేస్తున్నారు. 

Also Read: Nobel Prize in Chemistry: రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్

ఇంగ్లాండ్‌కు వలస వచ్చిన ఆయన తన జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవించారు. సంస్కృతి, ఖండాల మధ్య నలిగిపోయిన శరణార్థుల వ్యథను ప్రత్యక్షంగా చూసిన ఆయన వాటికి అక్షర రూపమిచ్చారు. 21ఏళ్ల వయసులోనే నవలలు రాయడం ప్రారంభించిన గుర్నా.. ఇప్పటివరకు 10 నవలలు, ఎన్నో చిన్న కథలు రచించారు. 1994లో ఆయన రాసిన 'ప్యారడైజ్‌'(Paradise‌)అనే నవల బుకర్‌ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్‌ అయ్యింది. 'స్వాహిలి ఆయన మొదటి భాష అయినప్పటికీ, ఇంగ్లీష్ అతని సాహిత్య సాధనంగా మారింది’ అని నోబెల్ జ్యూరీ ప్రశంసించింది.

నోబెల్ బహుమతులు ఏటా అక్టోబరు తొలివారం(October first week)లో ప్రకటిస్తారు. తొలుత వైద్యశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యంలో ప్రకటిస్తారు. ఇప్పటి వరకూ సాహిత్యంలో 117 మందికి నోబెల్ బహుమతి వరించింది. చివరిగా ఆర్ధిక శాస్త్రం, శాంతి విభాగంలో విజేతలను ప్రకటిస్తారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News