ఏపీలో మళ్లీ 52 కొత్త కేసులు..!!

తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' కోరలు చాస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటికి మొన్న 25 కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ నిన్నటికి  పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపైంది. దీంతో ఏపీలో ఆందోళన పెరుగుతోంది.

Last Updated : May 18, 2020, 11:57 AM IST
ఏపీలో మళ్లీ 52 కొత్త కేసులు..!!

తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' కోరలు చాస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటికి మొన్న 25 కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ నిన్నటికి  పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపైంది. దీంతో ఏపీలో ఆందోళన పెరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ  కరోనా పాజిటివ్ కేసులకు  సంబంధించిన బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 52 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల 282కు పెరిగింది. ప్రస్తుతం 705 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 50  మంది మృతి చెందారు. ఐతే గత 24 గంటల్లో ఒక్కరూ చనిపోకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. 

మరోవైపు కర్నూలులో జిల్లాలో మళ్లీ నాలుగు కేసులు పెరిగాయి.  దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 615కు చేరింది.  ప్రస్తుతం 163 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 433 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 19  మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News