ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం

ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం

Last Updated : Apr 26, 2019, 06:17 PM IST
ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం

కృష్ణా: పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లాలోని భైరవపట్నం సమీపంలో ఓ చోట రైలు పట్టాలు విరిగిపోయి ఉండటాన్ని గుర్తించిన కీమ్యాన్ వెంటనే స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో అధికారులు అటుగా వస్తున్న 17479 పూరి తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలును భైరవపట్నం స్టేషన్‌లో నిలిపివేశారు. విరిగిన రైలు పట్టాలకు తాత్కాలిక మరమత్తులు చేసిన అనంతరం రైలును అక్కడి నుంచి ముందుకు పోనిచ్చారు. కీమ్యాన్ అప్రమతంగా వ్యవహరించడంతో పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం బారినపడకుండా గండం దాటగలిగింది. 

Puri Tirupati Express train Broken railway track near Bhairavapatnam in krishna dist of Andhra pradesh

Trending News