చంద్రబాబు సెటైర్లు ; జగన్ పవర్‌లోకి వస్తే నీళ్లు రావు..కన్నీళ్లు వస్తాయి

చిత్తూరు జిల్లా పర్యటనలో ప్రతిపక్ష నేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  మదనపల్లెలో ఈరోజు జరిగిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ లాంటి వారి అధికారం కోసం కలగంటున్నారని..ఇది ఎప్పటికీ నెరవేరదన్నారు.

ఒకవేళ అధికారంలోకి వస్తే రైతులకు నీళ్లు కూడా దక్కవని..కన్నీళ్లే మిగులుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం తవ్వించిన కాలువల్లో నీళ్లకు బదులలు కన్నీళ్లే పారుతాయని హెచ్చరించారు. 

ఐటీ గ్రిండ్ కేసును ప్రస్తావిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ సాయంతో దొడ్డిదారిన ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్నికుట్రలు పన్నినా టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు

English Title: 
Ap cm fires on Jagan in chitoor tour
News Source: 
Home Title: 

చంద్రబాబు సెటైర్లు ; జగన్ పవర్‌లోకి వస్తే నీళ్లు రావు..కన్నీళ్లు వస్తాయి

చంద్రబాబు సెటైర్లు ; జగన్ పవర్‌లోకి వస్తే నీళ్లు రావు..కన్నీళ్లు వస్తాయి
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
చంద్రబాబు సెటైర్లు ; జగన్ వస్తే నీళ్లు రావు..కన్నీళ్లు వస్తాయి
Publish Later: 
No
Publish At: 
Monday, March 4, 2019 - 17:52