పవన్ కళ్యాణ్ నోటివెంట రక్తం.. ఏమైంది?

గతకొన్ని రోజులుగా పనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే..!!

Last Updated : Jan 30, 2018, 11:33 AM IST
పవన్ కళ్యాణ్ నోటివెంట రక్తం.. ఏమైంది?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంత పర్యటనలో బిజీగా ఉన్నారు. ప్రజా సమస్యలను ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా 'ఛలో రే ఛలో రే ఛల్' పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే..! ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు వద్ద యాత్రను ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. గత మూడు రోజులుగా అనంతపురంలో పర్యటిస్తున్నారు. ఈ యాత్ర మొదలు పవన్ జిల్లాలు తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారి కోరికలు తీరుస్తా అని హామీ ఇస్తున్నారు. 

పర్యటనలో భాగంగా.. పవన్ కళ్యాణ్ పుట్టపర్తి సత్యసాయి మందిరాన్ని దర్శించుకొని అనంతరం ధర్మవరం చేరుకొని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. చేనేత కార్మికులు ఆయనకు కష్టాలు వెల్లబుచ్చుకున్నారు. పవన్ ఇకపై వారికి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంలోనే పవన్ అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. గత 10 రోజుల నుండి మాట్లాడి మాట్లాడి నా గొంతు ఎండిపోయింది. దాంతో నా నోటివెంట రక్తం కారుతుందని వ్యాఖ్యానించారు.

Trending News