ఏపీలో 47 కొత్త కేసులు..!!

'కరోనా' మహమ్మారి తెలుగు రాష్ట్రాలను అల్లాడిస్తోంది. రోజు రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లోనూ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

Last Updated : May 23, 2020, 01:10 PM IST
ఏపీలో 47 కొత్త కేసులు..!!

'కరోనా' మహమ్మారి తెలుగు రాష్ట్రాలను అల్లాడిస్తోంది. రోజు రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లోనూ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

నిన్న ఒక్కరోజే  47  కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నోడల్ ఆఫీసర్ ఆర్జా శ్రీకాంత్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2561కి చేరిందన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు సంబంధించిన బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 56 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. నిన్న ఒక వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. 

మరోవైపు నిన్న ఒక్కరోజే 47 మందిని డిశ్చార్జి చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆస్పత్రుల నుంచి  డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1778కి చేరుకుంది. ప్రస్తుతం 727 మంది  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ  ఆస్పత్రులో చికిత్స పొందుతున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News