నవంబర్ 2 నుంచి జగన్ పాదయాత్ర

Last Updated : Oct 11, 2017, 12:16 PM IST
  • నవంబర్ 2 నుంచి జగన్ పాదయాత్ర
  • ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు యాత్ర
  • 3 వేల కిలో మీటర్ల వరకు పాదయాత్ర
  • 6 నెలల పాటు కొనసాగనున్న పాదయాత్ర
  • యువభేరిలో వైసీపీ చీఫ్ వెల్లడి
నవంబర్ 2 నుంచి జగన్ పాదయాత్ర

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. మొత్తం ఆరు నెలల పాటు సాగే ఈ యాత్ర ఇడుపులపాయ వైఎస్ఆర్ సమాధి నుంచి ప్రారంభమై.. శ్రీకాళకుం జిల్లా ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుంది. మంగళవారం అంతరంపురం లో జరిగిన వైసీపీ యువభేరిలో వైసీపీ అధినేత జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ... ఆరునెలల పాటు సాగే ఈ పాదయాత్రలో ఎక్కడికక్కడ జనంతో మమేకమవుతూ...రాష్ట్రంలో సాగుతున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి అందరికీ వివరిస్తానని వెల్లడించారు. పాదయాత్రలో ప్రత్యేక హోదా గురించి ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడగడతామని జగన్ పేర్కొన్నారు.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x