జనసేనకు మరో ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శుల నియామకం

జనసేన పార్టీకి మరో ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శులను నియమిస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బొలిశెట్టి సత్యనారాయణ (సత్య), కార్యదర్శులుగా గుంటూరుకు చెందిన గద్దె తిరుపతి రావు, మంగళగిరికి చెందిన చిల్లపల్లి శ్రీనివాస్‌ను నియమించారు. ముగ్గురి నియామకాలు ఈ రోజు నుంచి అమలులోకి వస్తాయని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ముగ్గురు పార్టీకి విలువైన సేవలను అందిస్తున్నందువల్లే పవన్ కల్యాణ్ వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. 

Last Updated : Nov 26, 2019, 09:25 PM IST
జనసేనకు మరో ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శుల నియామకం

అమరావతి: జనసేన పార్టీకి మరో ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శులను నియమిస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బొలిశెట్టి సత్యనారాయణ (సత్య), కార్యదర్శులుగా గుంటూరుకు చెందిన గద్దె తిరుపతి రావు, మంగళగిరికి చెందిన చిల్లపల్లి శ్రీనివాస్‌ను నియమించారు. ముగ్గురి నియామకాలు ఈ రోజు నుంచి అమలులోకి వస్తాయని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ముగ్గురు పార్టీకి విలువైన సేవలను అందిస్తున్నందువల్లే పవన్ కల్యాణ్ వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. 

విశాఖ నగరానికి చెందిన బొలిశెట్టి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా పార్టీ తరపున పర్యావరణానికి సంబంధించిన అంశాలపై దృష్టిసారించనున్నారు.

Trending News