Maoists: మావోయిస్టుల విధ్వంసం.. పోలీసుల కూంబింగ్

Maoists in AP: అమరావతి: ఏపీలో మావోయిస్టులు రెచ్చిపోయారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని సరివెల గ్రామ సమీపంలోని వెంకట్రామపురం వద్ద రోడ్డు పని కోసం ఉపయోగిస్తున్న భారీ వాహనాలకు మావోయిస్టులు నిప్పంటించి విధ్వంసానికి పాల్పడ్డారు. 

Last Updated : Jun 7, 2020, 12:50 AM IST
Maoists: మావోయిస్టుల విధ్వంసం.. పోలీసుల కూంబింగ్

Maoists in AP: అమరావతి: ఏపీలో మావోయిస్టులు రెచ్చిపోయారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని సరివెల గ్రామ సమీపంలోని వెంకట్రామపురం వద్ద మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. చంద్రవంక వాగుపై రహదారి, బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న స్థలానికి చేరుకున్న మావోయిస్టులు...  అక్కడ బ్రిడ్జి నిర్మాణ పనులుకు ఉపయోగిస్తున్న 2 జేసీబీ ప్రొక్లైన్లు, 1 ఐషర్, 1 లారీ, 2 ట్రాక్టర్లు, 1 మిల్లర్లలను తగలబెట్టారు ( torched vehicles). Read also : COVID-19 updates: మరో 161 మందికి కరోనా పాజిటివ్

మావోయిస్టుల రాక, విధ్వంసం గురించి సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఫోర్స్‌తో అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మావోలు అక్కడి పరిసర గ్రామాల్లోనే ఉంటారనే అనుమానంతో కూంబింగ్ మొదలుపెట్టారు. చింతూరు పరిసరాల్లోని పల్లెలు, అడవులు జల్లెడ పట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News