ట్విట్టర్ వేదికగా వైసీపీపై నారా లోకేష్ ఫైర్

Last Updated : Apr 23, 2018, 01:56 PM IST
ట్విట్టర్ వేదికగా వైసీపీపై నారా లోకేష్ ఫైర్

ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని జగన్ పాటిస్తున్నారని దయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న ధోరణిలో  వైసీపీ వ్యవరిస్తోందని ఆరోపించారు. జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు ఈ నెల 30న నిరసన దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే.చంద్రబాబు దీక్షపై  వైసీపీ విమర్శలు సంధిస్తోంది. ప్రత్యేక  హోదా విషయంలో  ప్రజలను చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు మోసగిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ అదే రోజు చంద్రబాబు దీక్షకు పోటీగా విశాఖపట్నంలో నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు  ప్రకటించడంతో నారా లోకేష్ ఇలా స్పందించారు. ప్రస్తుతం నారా లోకేష్ ట్వీట్ వైరల్ గా మరింది. లోకేష్ ను కొందరు సమర్థిస్తుంటే..మరికొందరు విమర్శలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో లోకేష్ చర్చనీయంశంగా మారింది

 

Trending News