పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు, కేటీఆర్ ఢిల్లీ టూర్

.

Last Updated : Oct 5, 2017, 10:54 AM IST
పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు, కేటీఆర్ ఢిల్లీ టూర్

ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన పాల్గొంటారు.  ఈ సందర్భంగా పారిశ్రామికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించి.. పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను కోరనున్నాయి. సదస్సు అనంతరం పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీకానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో పరిశ్రమలను ఏర్పాటుచేయాలని కోరనున్నారు.

పెట్టుబడలే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఐటీ, పురపాలక, పంచాయితీ మంత్రి కేటీఆర్ పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పారిశ్రామివేత్తలను కోరనున్నారు.

Trending News