Father raped daughter: వీడు మనిషేనా.. పదిరోజులుగా కన్నకూతురికి మత్తు మందు ఇచ్చి తండ్రి ఘాతుకం.. ఎక్కడంటే..?

Father raped her daughter: ప‌ల్నాడు జిల్లాలో దారుణ సంఘ‌ట‌న సంభవించింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి.. తన కూతురిపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం దుమారంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 28, 2024, 12:11 PM IST
  • మైనర్ కూతురుపై దారుణం..
  • పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు..
Father raped daughter: వీడు మనిషేనా.. పదిరోజులుగా కన్నకూతురికి మత్తు మందు ఇచ్చి తండ్రి ఘాతుకం.. ఎక్కడంటే..?

Father raped minor girl in palnadu macherla: మహిళలు, అమ్మాయిలు భద్రత ప్రస్తుతం పెనుసవాల్ గా మారిందని చెప్పుకొవచ్చు. బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు, ఆఫీసులు, చివరకు ఇంట్లో కూడా సెఫ్టీలేదని చెప్పుకొవచ్చు. అంతేకాకుండా.. ఇంట్లో నుంచి బైటకు వెళ్లిన వాళ్లు తిరిగి క్షేమంగా వచ్చే వరకు కూడా నమ్మకం లేకుండా పోయింది. కామాంధులు పసిపాప నుంచి  పండు ముసలి వరకు ఎవర్ని వదలడం లేదు. అభం శుభం తెలియని చిన్న పిల్లల్ని, ఆరోగ్యం బాగాలేని పెద్దవాళ్లను సైతం అత్యాచారాలు చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళ భద్రతకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు మాత్రం మారడం లేదు. నిర్భయ,పోక్సో వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా వీరిలో ఏ మాత్రం మార్పు కన్పించడం లేదు. కొంత మంది మరీ ఘోరంగా నోరులేని మూగ జీవాలైన ఆవులు,గేదెలు, శునకాలు, మేకల మీద కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన.. కన్న తండ్రి తన కూతురిపై పలు మార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఏపీలో పెనుదుమారంగా మారింది.

పూర్తి వివరాలు..

పల్నాడులో దారుణం చోటుచేసుకుంది.  మాచ‌ర్ల ప‌ట్ట‌ణంలోని వెల్దుర్తి మండలానికి చెందిన ఒక కాల‌నీకి ఒక వ్య‌క్తి కూర‌గాయ‌ల వ్యాపారం చేస్తున్నాడు. అత‌డికి వెల్దుర్తి మండ‌లానికి చెందిన మ‌హిళ‌తో ఆరేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. వీరికి ఇద్ద‌రు కుమార్తెలు. తన సొంత ఆడపిల్లలను తండ్రి అసభ్యంగా తాకడం, వంటి పాడు పనులు చేస్తుండటాన్ని తల్లి గమనించింది.దీంతో తన భర్తతో పోట్లాడి, తన బిడ్డలతోపుట్టింటికి వెళ్లిపోయింది.

రెండు నెల‌ల కింద‌ట పెద్ద మ‌నుషులతో పంచాయ‌తీ చేయించారు. తాను పూర్తిగా మారిపోయినట్లు నమ్మకంగా మాట్లాడాడు. అంతేకాకుండా.. తన భార్య, బిడ్డల్ని బాగాచూసుకుంటానంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. మహిళ, పిల్లలకు ప్రతిరోజు రాత్రి పూట కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి తాగించేవాడు. తమమీద ప్రేమతో ఇలా చేసేవాడని మహిళ భావించింది.

కానీ అతను మాత్రం.. తన నీచపు బుధ్దని మానుకోలేదు. ప‌ది రోజులుగా రాత్రి స‌మ‌యాల్లో కూల్‌డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపి భార్య‌, కుమార్తెకు తాగించేవాడు. ఆపై కుమార్తెపై అత్యాచారానికి పాల్ప‌డుతున్నాడు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల కూతురు.. ప్రతిరోజు టాయ్ లెట్ కు వెళ్లిన సమయంలో బాధపడేది. దీంతో అనుమానం వచ్చిన తల్లి.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆమెను టెస్టులు చేసిన వైద్యులు బిడ్డపై అత్యాచారం జరిగిందని చెప్పారు. దీంతో షాక్ కు గురైన తల్లి.. వెంటనే మాచ‌ర్ల పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి త‌న బిడ్డ‌పై త‌న భ‌ర్తే అఘాయిత్యానికి పాల్ప‌డ్డాన‌ని, ఆ కామాంధుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని ఫిర్యాదు చేసింది.

Read more; Kolkata doctor case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటన.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న మమతా బెనర్జీ..  

బాధితురాలి ఫిర్యాదు మేర‌కు సీఐ ప్ర‌భాక‌ర‌రావు పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. కేసును నివేదిక‌ను డీఎస్పీకి అంద‌చేశారు. ఈ క్రమంలో ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో పెనుదుమారంగా మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. ఇంతటి దారుణానికి పాల్పడటం పట్ల స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News