సెల్ఫీ తీసుకుంటున్న యువకుడిని లోపలికి లాక్కెళ్లిన సముద్ర కెరటం!

Last Updated : Aug 22, 2018, 06:46 PM IST
సెల్ఫీ తీసుకుంటున్న యువకుడిని లోపలికి లాక్కెళ్లిన సముద్ర కెరటం!

సెల్ఫీ సరదా ఓ 16 ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది. తెల్లవారితే ఇంట్లో పండగా అనగా సరదాగా బీచ్‌లో ఎంజాయ్ చేద్దామని వెళ్లి, సెల్ఫీలు తీసుకుంటున్న ముగ్గురు యువకులలో ఓ యువకుడిని సముద్ర కెరటం బలిగొంది. వైజాగ్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వైజాగ్ శివార్లలోని జోడుగుళ్లపాలెం బీచ్‌లో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 16 ఏళ్ల జయెద్ అనే యువకుడు సముద్రంలోనే మునిగి గల్లంతయ్యాడు. సముద్రంలో పడిన ఇద్దరు యువకులలో జయెద్ సోదరుడు ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. జయేద్ మాత్రం అలల తాకిడికి సముద్రంలోనే మునిగిపోయాడు. ఘటనపై సమాచారం కేసు నమోదు చేసుకుని గల్లంతయిన యువకుడి ఆచూకీ కోసం అన్వేషిస్తున్నట్టు అరిలోవా ఎస్సై సీహెచ్ తిరుపతి రావు తెలిపారు. 

ఈ ఘటనను చూసిన స్థానికులు.. తాము వద్దని వారించినా యువకులు వినకుండా సముద్రం దగ్గరకు వెళ్లారని చెప్పి ఆవేదన వ్యక్తంచేశారు.

Trending News