కుటుంబ విభేదాలపై వైఎస్ వివేకా కూతురు సునీత రియాక్షన్

                                                               

Last Updated : Mar 20, 2019, 10:56 AM IST
కుటుంబ విభేదాలపై వైఎస్ వివేకా కూతురు సునీత రియాక్షన్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో ఆయన కూతరు సునీత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ తన తండ్రి హత్య తమ కుటుంబ సభ్యులను ఎంతగానో భాదించిందన్నారు. తండ్రి హత్య కంటే ఆ తర్వాత జరిగిన ప్రచారం మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిందన్నారు. చనిపోయిన వ్యక్తి గురించి..ఆయన కుటుంబం గురించి దారుణమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. తమ కుటుంబ సభ్యుల మధ్య వివేధాలు ఉన్నాయని కొందరు ప్రచారం చేస్తున్నారు..ఇవన్ని పచ్చి అబద్దాలని సునీత వివరణ ఇచ్చారు. తమ కుటుంబంలో అందరూ పరస్పరం గౌవరించుకుంటారని తెలిపారు. తప్పుడు ప్రచారంతో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని సునీత విమర్శించారు

ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి
తన తండ్రిని దారుణంగా హత్య చేశారని పేర్కొన్న సునీత ..విచారణ నిష్పాక్షికంగా జరగాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అయినా పర్వలేదు..కానీ విచారణ మాత్రం ఫెయిర్ గా జరగాలని  కోరారు. వివేకా హత్య కేసు ప్రస్తుతం రాష్ట్ర ప్రభత్వానికి చెందిన సిట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఈ హత్య కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలన్న వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సునీత ఈ రకంగా స్పందించడం గమనార్హం

జగన్ సీఎం కావాలనేది నాన్న కల..
జగన్ అన్న ఫ్యామిలీతో తమకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని సునీత పేర్కొన్నారు. జగన్ అన్నను సీఎంగా చూడాలని తన తండ్రి వైఎస్ వివేకా ఎంతగానో ఆరాటపడ్డారని.. ఇది తండ్రి కల అని సునీత పేర్కొన్నారు. 

 

Trending News