Chandrababu: శ్రీలంక కంటే ఏపీలో పాలన దారుణంగా ఉంది..చంద్రబాబు హాట్ కామెంట్స్..!

Chandrababu: ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు.  

Written by - Alla Swamy | Last Updated : Jul 21, 2022, 03:48 PM IST
  • ఏపీలో రాజకీయ వేడి
  • వైసీపీ వర్సెస్ టీడీపీ
  • తాజాగా హాట్ కామెంట్స్
Chandrababu: శ్రీలంక కంటే ఏపీలో పాలన దారుణంగా ఉంది..చంద్రబాబు హాట్ కామెంట్స్..!

Chandrababu: వైసీపీ మూడేళ్ల పాలనపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువన్నారు. అందుకే ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. ఆ ప్రభావంపై తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లో ఉందని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పశ్చిమగోదావరి జిల్లా ఇలపర్రులో స్థానికులతో మాట్లాడారు.

దేశంలోనే అధిక ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్‌ అని అన్నారు. దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన ప్రభుత్వంగా ఏపీ నిలుస్తుందన్నారు. బాదుడే బాదుడు అన్న చందంగా సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌ను రివర్స్ గేర్‌లో వెనక్కి నెట్టారని ఆరోపించారు. అంతకుముందు పెనుగొండ మండలం నశిపూడిలో చంద్రబాబు పర్యటించారు. వరద బాధితుల కష్టాలను తెలుసుకున్నారు. వారికి భరోసా ఇచ్చారు. 

Also read:Presidential Election Result-LIVE Updates: కొనసాగుతున్న భారత రాష్ట్రతి ఎన్నికల కౌంటింగ్..ఆధిక్యంలో ద్రౌపది ముర్ము..!

Also read:Somu Veerraju: పోలవరాన్ని వివాదస్పదం చేసేందుకు కుట్ర జరుగుతోందా..? సోమువీర్రాజు ఏమన్నారంటే..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News