Spanish Woman Gang Raped: వీళ్లు మనుషులేనా.?.. భారత సందర్శనకు వచ్చిన స్పెయిన్ మహిళపై అత్యాచారం.. ఎక్కడంటే..?.

Spanish Tourist: స్పెయిన్ దేశానికి  చెందిన దంపతులు భారత పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ లోని దుమ్కా పర్యటనకు వెళ్లారు. అక్కడే రాత్రి బస చేయడానికి ప్లాన్ చేశారు. టెంట్ వేసుకున్నారు.ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 

Written by - Inamdar Paresh | Last Updated : Mar 2, 2024, 09:29 PM IST
  • భారత సందర్శనకు భర్తతో కలసి బైక్ మీద వచ్చిన మహిళ..
  • జార్ఖండ్ లోని దుమ్కాలో ఉండగా అనుకోని ఘటన..
Spanish Woman Gang Raped: వీళ్లు మనుషులేనా.?.. భారత సందర్శనకు వచ్చిన స్పెయిన్ మహిళపై అత్యాచారం.. ఎక్కడంటే..?.

Jharkhand Spanish Woman Gang Raped At Dumka: ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు ప్రవర్తనలో మాత్రం మార్పులు రావడంలేదు.  ఇంట్లో నుంచి బైటకు వెళ్లిన మహిళ మరల జాగ్రత్తగా ఇంటికి చేరుకోవడం కూడా అనుమానంగా మారింది. పసి గుడ్డు నుంచి పండు ముసలి వరకు ఎవరిని దుర్మార్గులు వదలడం లేదు. బస్టాండ్,  ఆఫీసు, స్కూల్ లు ఎక్కడ కూడా మహిళలకు భద్రత లేదని చెప్పుకోవచ్చు. చివరకు పోలీసులు కూడా కొందరు మహిళలను వేధించడం వార్తలలో నిలిచింది. అదే విధంగా కొందరు మరీ నీచంగా నోరులేని జీవాలపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు కూడా తరచుగా వార్తలలో ఉంటున్నాయి.

Read More: Snake Bite: పాములు కుట్టబోయే ముందు ఈ సిగ్నల్స్ ఇస్తాయంట.. అలర్ట్ అయితే రిస్క్ నుంచి బైటపడ్డట్లే..

ఇదిలా ఉండగా.. కొందరు విదేశీయులు మన దేశం గొప్పదనం, భారత్ లోని అనేక పర్యటక ప్రాంతాలు చూడటానికి వస్తుంటారు. ఇలా వచ్చిన వారు స్థానిక భాష రాక.. ఇక్కడి వారిని నమ్ముతుంటారు. గైడ్ లుగా పెట్టుకుంటారు. ఇలాంటి ప్రదేశంలో కూడా కొందరు తియ్యగా మాట్లాడి ముగ్గులోకి దించుతారు.  

ఆ తర్వాత తమ రంగులను బైటపెడుతుంటారు. టూరిస్టులపై కూడా అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు కొకొల్లలు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. స్పెయిన్ దేశానికి చెందిన మహిళ తన భర్తతో కలిసి  భారత సందర్శనకు వచ్చింది. అప్పుడు ఆమె ఒక ప్రాంతంలో టెంట్ వేసుకుని సేదతీరుతున్నారు. కొందరు ఉన్మాదులు వారిపై దాడిచేసి, విదేశీయురాలిపై సాముహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

పూర్తి వివరాలు...

భారత దేశం గొప్పతనం, ఆచారాలు, సంప్రదాయాలను దగ్గరి నుంచి చూడాలని స్పెయిన్ దేశానికి చెందిన మహిళ తన భర్తతో కలిసి వచ్చింది. ఇద్దరు కలిసి బైక్ మీద అనేక ప్రాంతాలు సందర్శిస్తున్నారు. దీనిలో భాగంగా..  మహిళ.. జార్ఖండ్ చేరుకున్నారు.  సదరు మహిళ తన భర్తతో కలిసి, దుమ్కా లోని హన్స్ దిహా ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసుల ప్రకారం.. శుక్రవారం రాత్రి జంట తాత్కలికంగా టెంట్ ను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటిదాక ఇద్దరు ఎన్నో భారత దేశంలో సందర్శించాల్సిన ప్రదేశాల గురించి మాట్లాడుకున్నారు.

ఈక్రమంలోనే కొందరు దుర్మార్గులు అక్కడికి చేరుకున్నారు. స్పెయిన్ జంటపై దాడిచేసి, మహిళపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా సదరు జంట తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చాలా సేపు మహిళను వేధించినట్లు సమాచారం. ఆ తర్వాత అక్కడ వదిలేసి నిందితులు పరారయ్యారు. ఆ తర్వాత మహిళ.. తన భర్తతో కలసి, స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

స్పెయిన్ దేశానికి చెందిన బాధితురాలిని దుమ్కాలోని ఫూలో జానో మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటిదాక పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు సమాచారం.

Read More: Honey Rose: రోజా పువ్వుల మెరిసిపోయిన హనీ రోజ్.. ఫోటోలు చూస్తే ఫిదా

ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ క్రమంలో..  మనదేశం సందర్శనకు వచ్చిన వారితో ఇలా ప్రవర్తించడం దారుణమని నెటిజన్లు కామెంట్ల రూపంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   ఇలాంటి నేరంకు పాల్పడిన వారిని కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన వల్ల విదేశీ గడ్డపై భారత దేశం పరువుఏమౌతుందో ఆలోచించారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News