టాలీవుడ్‌కి తెరపైకి మరో నటవారసుడు

                     

Last Updated : Oct 23, 2017, 01:13 PM IST
టాలీవుడ్‌కి తెరపైకి మరో నటవారసుడు
టాలీవుడ్ పరిశ్రమలోకి మరో నటవారసుడు రాబోతున్నారు. 2018లో విడుదలవబోయే ఓ చిత్రం ద్వారా తన లక్‌ను పరీక్షించుకోనున్నారు. అతను మరెవరో కాదు.. స్వయానా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు మరియు హీరో రానా తమ్ముడు అభిరామ్. భానుశంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ చిత్రంలో అభిరామ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం. అభిరామ్ ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకొని ఉండడంతో, అతన్ని కూడా నిర్మాత సురేష్‌బాబు ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన భానుశంకర్ గతంలో అర్థనారి, సరదాగా అమ్మాయితో అని రెండు సినిమాలు తీశారు. అయితే అవి అంతగా విజయం సాధించలేదు.
 
ఈ క్రమంలో అభిరామ్‌తో సినిమా చేయడం అనేది ఆ దర్శకుడికి కూడా తన ప్రతిభను  నిరూపించుకొనే అవకాశమని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు అంటున్నారు. గతంలో అభిరామ్ హీరోగా దర్శకుడు వంశీ "ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్" అనే సినిమా తీయాలని భావించారు. అయితే ఆ ప్రయత్నంమెందుకో విరమించుకున్నారు. తర్వాత అదే సినిమా నాగ్ ఆశ్విన్ హీరోగా తెరకెక్కింది. 

Trending News