Allu Arjun Wax Statue: మైనపు విగ్రహంలో కూడా తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్..

Allu Arjun Wax statue Madame tussauds: అల్లు అర్జున్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో తెలుగులోనే కాదు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నాడు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డులకు ఎక్కాడు అల్లు అర్జున్. తాజాగా ఈయన దుబాయ్‌కు చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని నిన్న కొలువు తీరిన సంగతి తెలిసిందే కదా. తాజాగా అందులో అల్లు అర్జున్ మైనపు బొమ్మగా కొలువైన విగ్రహాన్ని తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో అల్లు అర్జున్ పోస్ట్ చేసాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 29, 2024, 09:48 AM IST
Allu Arjun Wax Statue: మైనపు విగ్రహంలో కూడా తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్..

Allu Arjun Wax statue Madame tussauds:అల్లు అర్జున్‌కు సంబంధించిన మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ విగ్రహాన్ని అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లి స్వయంగా తర మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. ఇక అల్లు అర్జున్.. హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమా రిలీజై కరెక్ట్‌గా 21 యేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఈ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. తాజాగా అల్లు అర్జున్ మైనపు విగ్రహంగా కొలువు తీరిన తర్వాత ఆ మైనపు విగ్రహంతో ఉన్న సెల్ఫీ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. 'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ వేసుకున్న ఎర్రటి బ్లేజర్‌తో 'పుష్ప' సినిమాలో తగ్గేదేలే గెటప్‌తో ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ తెలుగులో మెగా కాంపౌండ్ హీరోగా అడుగుపెట్టి తన కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక 2021లో 'పుష్ప' సినిమాలోని నటకు జాతీయ ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు నుంచి తొలిసారి నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు బన్ని. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో సౌత్ భారత దేశం నుంచి ఎక్కువ  ఫాలోవర్స్ ఉన్నహీరోగా కూడా రికార్డు క్రియేట్ చేసాడు. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్ .. అల్లు డాక్యుమెంటరీ చేసిన సంగతి తెలిసిందే కదా. మన దేశంలో ఈ ఘనత అందుకున్న ఫస్ట్ యాక్టర్ అల్లు అర్జునే కావడం విశేషం. ఇలా తన పేర ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోన్న అల్లు అర్జున్ .. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీల మైనపు విగ్రహాలను పెట్టే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరడంతో అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ విగ్రహం కోసం గతంలో అల్లు అర్జున్‌కు సంబంధించిన కొలతలు తీసుకున్నారు మేడమ్ టుస్సాడ్స్ వాళ్లు.   పుష్ప గెటప్‌లో  అల వైకుంఠపురములో బన్ని వేసుకున్న బ్లేజర్‌తో ఉన్నమైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన తెలుగు హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలున్నాయి. తాజాగా అల్లు అర్జున్ ఈ లిస్టులో చేరడం విశేషం. అంతేకాదు తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటి కప్పుడు తెలియజేస్తున్నాడు.  

ఇక అల్లు అర్జున్ గత సినిమా పుష్ప సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూ. 365 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాయి. ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కానీకొచ్చింది. ఒకవైపు సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడు సుకుమార్ ఈ సినిమా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్... పుష్ప 2 మూవీ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, బోయపాటి శ్రీను, అట్లీ, సురేంద్ రెడ్డి వంటి దర్శకులతో ఈయన సినిమాలు చేయనున్నట్టు సమాచారం.

Also Read:  Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్‌..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News