'పంజాబీ' యుద్ధవీరుడిగా అక్షయ్..!

పంజాబీ యుద్ధవీరుడైన కేసరి పాత్రలో నటుడు అక్షయ్ కుమార్ తన అభిమానులను అలరించనున్నారు. 

Last Updated : Jan 5, 2018, 06:05 PM IST
'పంజాబీ' యుద్ధవీరుడిగా అక్షయ్..!

పంజాబీ యుద్ధవీరుడైన కేసరి పాత్రలో నటుడు అక్షయ్ కుమార్ తన అభిమానులను అలరించనున్నారు. కరణ్ జోహార్‌తో కలిసి తానే స్వయంగా "కేసరి" అనే సినిమా నిర్మిస్తున్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సర్గాహీ యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. వేలమంది ప్రత్యర్థులను కేవలం 21 మంది సిక్కు సైనికులు ఎదిరించడమే కేసరి కథ. గులిస్తాన్ కోటలను ఆప్ఘన్ల నుండి కాపాడడమే లక్ష్యంగా చేసుకున్న సిక్కువీరుల కథ ఇది.

1897లో ఈ యుద్ధం జరిగింది. "బోలే సో నిహాల్.. సత్ శ్రీ అకాల్" అన్న నినాదంతో మడమ తిప్పని ధైర్యంలో సిక్కువీరులు ఎలా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేశారన్నదే ఈ చారిత్రక కథాంశం. గతంలో రాజ్ కుమార్ హిరాణీతో పాటు అజయ్ దేవగన్ లాంటి వారు ఈ కథను తెరకెక్కించాలని చూశారు. అయితే అనుకోని కారణాల వల్ల అవి సినిమా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ధైర్యం చేయడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

Trending News