Sushant singh rajput: విష ప్రయోగం వల్లనే మరణం : బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి

బాలీవుడ్ నటుడు ( Bollywood actor ) సుశాంత్ సింహ్ రాజ్ పుత్ మరణంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. విష ప్రయోగం వల్లనే సుశాంత్ మరణించాడంటూ ఆరోపించడం చర్చనీయాంశమవుతోంది.

Last Updated : Aug 25, 2020, 05:29 PM IST
Sushant singh rajput: విష ప్రయోగం వల్లనే మరణం : బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి

బాలీవుడ్ నటుడు ( Bollywood actor ) సుశాంత్ సింహ్ రాజ్ పుత్ మరణంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. విష ప్రయోగం వల్లనే సుశాంత్ మరణించాడంటూ ఆరోపించడం చర్చనీయాంశమవుతోంది.

సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ( Subramanian swamy ) మరో సంచలనానికి తెర తీశారు. బాలీవుడ్ నటుడైన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ...విష ప్రయోగం వల్లనే మరణించాడంటూ ఆరోపించారు. సుశాంత్ బాడీలో ఉన్న విషయం ఆనవాలు పోయేంతవరకూ నిరీక్షించి..అప్పుడు పోస్ట్ మార్టమ్ నిర్వహించారని ఆరోపిస్తున్నారు సుబ్రహ్మణ్యస్వామి. నేరస్థుల మనస్తత్వం, చెడు ఉద్దేశాల గురించి త్వరలోనే బయటపడుతుందని చెప్పారు.

మరోవైపు సుశాంత్ సన్నిహితుడిగా ఉన్న సందీప్ సింగ్ ( Sandip singh ) వ్యవహారంపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. సందీప్ సింహ్ తరచూ దుబాయ్ కు వెళ్లడానికి కారణమేంటని ప్రశ్నించారు. మొదట్నించీ సుశాంత్ మరణంపై సుబ్రహ్మణ్యస్వామి సందేహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ..ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. నిజానిజాల్ని వెలికితీసేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది. Also read: CA Exam Date 2020: సీఏ పరీక్షల తేదీలు.. పూర్తి వివరాలు

Trending News