Jr.NTR: కేజీఎఫ్ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ మూవీ.. బడ్జెట్ ఎంతో తెలుసా ?

జూనియర్ ఎన్టీఆర్ ( Jr.NTR ) అభిమానులు చాలా కాలం నుంచి ఒక మంచి వార్త కోసం వేచి చూస్తున్నారు. తారక్ నటించి నెక్ట్స్ సినిమా గురించి ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. 

Last Updated : Sep 16, 2020, 10:00 PM IST
    • జూనియర్ ఎన్టీఆర్ ( Jr.NTR ) అభిమానులు చాలా కాలం నుంచి ఒక మంచి వార్త కోసం వేచి చూస్తున్నారు.
    • తారక్ నటించి నెక్ట్స్ సినిమా గురించి ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
    • అదే సమయంలో జాతీయ స్థాయిలో సంచలనం క్రియేట్ చేసిన కేజీఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో జూనియర్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Jr.NTR: కేజీఎఫ్ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ మూవీ.. బడ్జెట్ ఎంతో తెలుసా ?

జూనియర్ ఎన్టీఆర్ ( Jr.NTR ) అభిమానులు చాలా కాలం నుంచి ఒక మంచి వార్త కోసం వేచి చూస్తున్నారు. తారక్ నటించి నెక్ట్స్ సినిమా గురించి ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో సంచలనం క్రియేట్ చేసిన కేజీఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో జూనియర్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రియేటీవ్ దర్శకుడితో సినిమా చేయనున్నాడు అని తెలియగానే టాలీవుడ్ ప్రేక్షకులు సంబరపడ్డారు. తారక్ స్టామినాకు తగ్గ దర్శకుడు ప్రశాంత్ నీల్ ( Prashant Neel ) అని.. వారిద్దరి మధ్య సినిమా వస్తే అది వండర్ అవుతుంది అని సంతోషడ్డారు. 

Also Read: Shraddha Kapoor: ప్రభాస్ ఛాలెంజ్ పూర్తి చేసిన సాహో హీరోయిన్

అయితే తారక్ ప్రస్తుతం బాహుబలి (Baahubali )తో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళితో ( Rajamouli ) RRR మూవీ చేస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య పోటాపోటీ సీన్స్ ఉంటాయి అని వినికిడి. రాజమౌళి RRR మూవీ విడుదల కాగానే క్రియేటీవ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ అధికారికంగా వెల్లడించాడు.  

అదే సమయంలో ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా చేయనున్నాడు తారక్. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ప్రశాంత్ నీల్.. తారక్ కలిసి చేయనున్న సినిమా బడ్జెట్ ఎంతో తెలిసిపోయింది. ఈ మూవీని రూ.250 కోట్లతో తెరకెక్కించనున్నారు అని సమాచారం. 2021 సెకండ్ హాఫ్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Also Read: Rajinikanth to PSPK:  మీ ఫేవరిట్ హీరోల అసలు పేర్లేంటో తెలుసా ?

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2 ) తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. కరోనావైరస్ (Coronavirus ) వల్ల ఏర్పడిని లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ కొన్ని నెలల పాటు ఆగిపోయింది. ఇటీవలే మళ్లీ ప్రారంభం అయింది. యష్ హీరోగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ అతి క్రూరమైన విలన్ అధీరాగా కనిపించనున్నాడు. 2018 లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మూవీ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేసే అవకాశం ఉంది.  మరి ఈ మూవీ లో హీరోయిన్ ఎవరు ? విలన్ ఎవరు ? అనే విషయం మాత్రం కొద్ది కాలం ఆగితేనె తెలుస్తుంది. ఈ మూవీ ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అభిమానులు సంతోషపడుతున్నారు. తెలుగు హీరోలో ప్యాన్ ఇండియా మూవీస్ చేయడం గర్వకారణం అంటున్నారు.

Also Read: Men's Tips For Beard: గడ్డం పెంచడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

 

Trending News