Bhola Shankar New Schedule : కోల్‌కతాలో భోళా శంకర్.. సెట్‌లో చిరు.. పిక్స్ వైరల్

Bhola Shankar New Schedule చిరంజీవి తాజాగా కోల్‌కతాకు వెళ్లాడు. భోళా శంకర్ కోసం యూనిట్ అంతా కూడా కోల్‌కత్తాకు వెళ్లింది. అయితే భోళా శంకర్ సినిమా కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిరు నిన్న స్పెషల్ ఫ్లైట్‌లో కోల్‌కతాకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2023, 12:31 PM IST
  • నెట్టింట్లో చిరు పిక్స్ వైరల్
  • కలకత్తాలో భోళా శంకర్ షూట్
  • మెగాస్టార్ స్టైలిష్ పిక్స్ హల్చల్
Bhola Shankar New Schedule : కోల్‌కతాలో భోళా శంకర్.. సెట్‌లో చిరు.. పిక్స్ వైరల్

Bhola Shankar New Schedule చిరంజీవి మెహర్ రమేష్‌ కాంబోలో భోళా శంకర్ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ చెల్లిగా, తమన్నా హీరోయిన్‌గా ఈ సినిమాలో చిరంజీవి పక్కన కనిపించనున్నారు. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను త్వరగానే పూర్తి చేయాలని యూనిట్ భావిస్తున్నట్టుగా ఉంది.

ఈ క్రమంలోనే నిన్న చిరంజీవి, మెహర్ రమేష్‌ ఇలా యూనిట్ అంతా కూడా కోల్‌కతా చేరుకుంది. ఈ సినిమాలో చిరంజీవి ట్యాక్సిడ్రైవర్‌గా కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ కొంత భాగం కోల్‌కత్తాలోనే జరుగుతుంది. అయితే అప్పట్లో కరోనా కారణంగా హైద్రాబాద్‌లోనే కోల్‌కతా సెట్ వేసి షూటింగ్ కానిచ్చారు. ఇప్పుడు ఇలా కోల్‌కతాకే సినిమా యూనిట్ వెళ్లింది.

వేదాళం సినిమా, ఊసరవెళ్లి సినిమా ఇంచు మించు ఒకేలా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒక సినిమాలో హీరోయిన్ కోసం హీరో నిలబడితే.. అనాథ చెల్లి కోసం హీరో నిలబడతాడు.. కానీ కథనంలో తేడాలుంటాయి. అయితే ఇప్పుడు మెహర్ రమేష్ ఈ సినిమాకు ఎలాంటి మార్పులు చేర్పులు చేశాడో చూడాలి.

Also Read:  samyuktha hegde : బికినీలో తాటిచెట్టెక్కిన సంయుక్త..పిచ్చెక్కించిన 'కిరాక్' బ్యూటీ

తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా ఈ సినిమాలో మెహర్ చేసిన మార్పులు ఏ మేరకు నిలబెడతాయో చూడాలి. కీర్తి సురేష్ నటిస్తున్న పాత్రకు మొదటగా.. సాయి పల్లవిని సంప్రదించిన సంగతి తెలిసిందే. అడిగింది చిరంజీవి అయినా సరే సాయి పల్లవి నో చెప్పడంతో అప్పట్లో ఆ వార్త వైరల్ అయింది. అయితే తాను రీమేక్‌లకు నో చెబుతాను అని.. ఒక వేళ నటిస్తే పోలికలు ఎంచుతారంటూ సాయి పల్లవి వివరణ ఇచ్చుకుంది.

 

చిరంజీవి సైతం సాయి పల్లవితో స్టెప్పులు వేయాలనుకుంటాను గానీ.. చెల్లిగా ఊహించుకోలేను అంటూ వేసిన సెటైర్లు అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి. మొత్తానికి చిరంజీవి మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇవ్వడం లేదు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్‌ అవ్వడంతో చిరు తన లైనప్ మార్చేసినట్టుగా తెలుస్తోంది.

Also Read:  Prabhas Hospitality : నిజంగానే రాజువయ్యా!.. ప్రభాస్ గొప్పదనం చెప్పిన రంగస్థలం మహేష్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News