Chiranjeevi - Vishwambhara: విడుదలకు యేడాది ముందే భారీ రేటుకు అమ్ముడు పోయిన చిరు 'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్..

Chiranjeevi - Vishwambhara: చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా విడుదలకు యేడాది ముందే 'విశ్వంభర' ఓవర్సీస్‌ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 21, 2024, 08:35 AM IST
Chiranjeevi - Vishwambhara: విడుదలకు యేడాది ముందే భారీ రేటుకు అమ్ముడు పోయిన చిరు 'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్..

Chiranjeevi - Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 68 యేళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు చిరు. ఈ మూవీని 2025 జనవరి 10న సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి ముందే సంక్రాంతి బెర్త్ కన్ఫామ్ చేసుకుంటున్నారు.. ఓ వైపు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్స్ కోసం కసరత్తు చేస్తూ రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఇప్పటికే విడుదలైన 'విశ్వంభర' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ రివీల్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు When MYTHS Collides Legends Rise అని చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే ఎపుడైతే అద్భుత శక్తులు కలుస్తాయో.. అపుడు ఒక లెజెండ్ అదే అద్భుతమైన వ్యక్తి పుట్టుకొస్తాడని అర్ధంలో కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసారు. ముందుగా ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. కానీ ఫైనల్‌గా ఈ మూవీకి 'విశ్వంభర' టైటిల్ ఫిక్స్ చేసారు.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష సహా మరో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే త్రిష ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయింది.  మరోవైపు వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. చిరు.. యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి. అంజి సినిమాల తర్వాత నటిస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' కావడం గమనార్హం. ఈ మూవీలో చిరును ఢీ కొట్టే విలన్ పాత్రలో తమిళ హీరో శింబు యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కథ విని ఇందులో చిరు పక్కన నటించాలనే కోరికతో ఈ మూవీ యాక్సెప్ట్ చేసినట్టు సమాచారం. మరోవైపు తమిళంలో శింబుతో తమిళంలో ఈ సినిమాకు మంచి మార్కెట్ దొరికే అవకాశం ఉంది.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం రవితేజతో 'మిస్టర్ బచ్చన్' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'రెయిడ్' మూవీకి రీమేక్. మరోవైపు పవన్ కళ్యాణ్‌తో చేస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎన్నికల తర్వాత ఈ యేడాది ద్వితీయార్ధంలో మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఆ లోపు రవితేజ తర్వాత చిరుతో ఈ సినిమా కంప్లీట్ చేయనున్నాడు. త్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: హరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు.. బీఆర్ఎస్ ను ఏకీపారేసిన సీఎం రేవంత్ రెడ్డి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News