Sudheer Babu- Krithi Shetty: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి!!

స్టార్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో యువ హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వామి అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 04:34 PM IST
  • మైత్రీ మూవీ మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్
  • ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నుంచి బిగ్ అప్డేట్
  • ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో భాగస్వామిగా మైత్రీ మూవీ మేకర్స్
Sudheer Babu- Krithi Shetty: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి!!

Mythri Movie Makers joins Sudheer Babu, Krithi Shetty's Aa Ammayi Gurinchi Meeku Cheppali: స్టార్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohanakrishna Indraganti) దర్శకత్వంలో యువ హీరో సుధీర్ బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. బెంచ్‌మార్క్ స్టూడియోస్‌ బ్యానర్‌ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' (Aa Ammayi Gurinchi Meeku Cheppali) అనే ఆసక్తికర టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సరికొత్త ప్రేమ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తమతో జాయిన్ అవ్వడం పట్ల 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్ర బృందం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఓ వీడియోను యూట్యూబ్‌లో బుధవారం (డిసెంబర్ 29) విడుదల చేసింది. వీడియోలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా నిర్మాణ వ్యవహారంలో భాగస్వామి కాబోతోందని స్పష్టం చేసింది. 'ప్రౌడ్ టు వెల్‌కమ్ మైత్రీ మూవీ మేకర్స్.. ఆన్ బోర్డు' అని పేర్కొంది. త్వరలోనే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ఈ వీడియో ద్వారా స్పేటం చేశారు. అంతేకాదు సినిమా విడుదల తేదీని కూడా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. 

Also Read: Mohammad Shami: 200 వికెట్ అనంతరం.. షమీ ఎమోషనల్ సెలబ్రేషన్స్! ఎవరి కోసమో తెలుసా? (వీడియో)

సరికొత్త ప్రేమ కథతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' (AMGMC) సినిమాను బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. పిజి విందా కెమెరా మెన్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. అందుకు తగ్గట్టే సినిమా టైటిల్ ఉంది. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగం కావడంతో మరింత హైప్ నెలకొంది. సుధీర్ బాబు (Sudheer Babu), కృతి శెట్టి (Krithi Shetty) ల కాంబినేషన్ బాగుందనే టాక్ ఇప్పటికే వచ్చింది. 

Also Read: Manchu Manoj Corona: మంచు మనోజ్‌కు కోవిడ్ పాజిటివ్.. ఆందోళన అక్కర్లేదంటూ హీరో ట్వీట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News