Raju Shrivastava: తీవ్ర విషమంగా కమెడియన్ శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి!

Raju Shrivastava Health Update: హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ జిమ్ చేస్తూ ఉండగా గుండెపోటుతో హాస్పిటల్ పాలవగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2022, 01:47 PM IST
Raju Shrivastava: తీవ్ర విషమంగా కమెడియన్ శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి!

Raju Shrivastava Health Update: హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ జిమ్ చేస్తూ ఉండగా గుండెపోటుతో హాస్పిటల్ పాలయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని అంటున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆయనకు ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది. మరి కొన్ని గంటలు గడిచిన తరువాతే ఏ విషయం అయినా చెప్పగలమని వైద్యులు పేర్కొన్నారు. అయితే రాజు శ్రీవాస్తవ ఆరోగ్యంలో కొంత మెరుగుదల కనిపించిందని ఒక వార్త బయటకు వచ్చింది.

రాజు శ్రీవాస్తవకు ఇస్తున్న మందులు అతని ఆరోగ్య పరిస్థితిలో కొంత సానుకూల సంకేతాలను చూపించాయని అంటున్నారు. అయితే ఆయన వెంటిలేటర్‌పైనే ఉండడంతో మెదడు స్పందించడం లేదని అంటున్నారు. ఈ చికిత్స రాజు శ్రీవాస్తవ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని డాక్టర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాజు శ్రీవాస్తవ కుటుంబం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ వార్తలన్నీ పుకార్లు అని పేర్కొంది.

రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని,  వైద్యుల బృందం పూర్తి బాధ్యతతో ఆయన ఆరోగ్యాన్ని కాపాడుతోందని ప్రకటనలో పేర్కొన్నారు. నిరంతర ప్రేమ, మద్దతు తెలుపుతున్న ఆయన శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు అని ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం గురించి పుకార్లు లేదా తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.

దయచేసి రాజు శ్రీవాస్తవ గారి ఆరోగ్యం కోసం ప్రార్థించండని రాజు శ్రీవాస్తవ కుటుంబం కోరింది. ఇక రాజు ఆరోగ్యం బాగుండాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఈ రోజు ఉదయం రాజు కుటుంబ సభ్యులు ఎయిమ్స్ సమీపంలోని గురుద్వారాకు వెళ్లి రాజు శ్రీవాస్తవ కోలుకోవాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులందరూ ఎయిమ్స్‌లో ఉన్నారని రాజు సోదరుడు కాజు శ్రీవాస్తవ బావమరిది ప్రశాంత్ వెల్లడించారు.

రాజు పరిస్థితి ఈరోజు కూడా అలాగే ఉందని, నిన్న అతని పరిస్థితిలో కొంత మెరుగుదల ఉందని వైద్యులు తెలిపారు. తన బావ, రాజు తమ్ముడు కాజు కూడా ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరారని ప్రశాంత్ వెల్లడించారు. ఆగస్టు 10న ఢిల్లీలోని ఓ హోటల్ జిమ్‌లో రాజు శ్రీవాస్తవకు గుండెపోటు రావాడంతో అతని శిక్షకుడు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాజు భార్య శిఖ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారని వెల్లడించారు. 

Also Read: Karthikeya 2 Review: సూపర్ హిట్ కార్తికేయ సీక్వెల్ సినిమా ఎలా ఉందంటే?

Also Read: Nayanthara: ఇంకా హనీమూన్ మూడ్ లోనే నయనతార-విగ్నేష్.. ఆ దేశానికి జంప్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News