Rashmika Remuneration: పుష్ప సక్సెస్.. భారీగా పెంచేసిన రష్మిక మందన్న! వామ్మో మరీ అంతనా?!!

'పుష్ప' పార్ట్ 2కి రష్మిక మందన్న రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నారు. రష్మిక కెరీర్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ ఇదే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 07:37 PM IST
  • పుష్ప సినిమా భారీ విజయం
  • భారీగా పెంచేసిన రష్మిక మందన్న
  • మూడు కోట్లు డిమాండ్ చేసిన రష్మిక
Rashmika Remuneration: పుష్ప సక్సెస్.. భారీగా పెంచేసిన రష్మిక మందన్న! వామ్మో మరీ అంతనా?!!

Rashmika Mandanna demands 3 crores for Pushpa second part: 'ఛలో' సినిమాతో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే హిట్ కావడంతో ఆమెకి తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి. అందం, అభినయం ఉండడం కూడా రష్మికకు కలిసొస్తోంది. వరుస హిట్స్ కొడుతూ.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. గోల్డెన్ లెగ్ (Golden Leg) అనే ముద్ర ఉండడంతో దర్శకనిర్మాతలు రష్మిక డేట్స్ (Rashmika Dates) కోసం క్యూ కడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో జతకట్టిన రష్మిక.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్పతో నేషనల్ స్టార్ అయ్యారు. 

సుకుమార్ (Sukjumar) దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప: ది రాజ్' (Pushpa) సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అన్ని భాషలలో భారీ వసూళ్లను రాబట్టింది. పుష్ప సినిమా విజయవంతం కావడంతో పాన్ ఇండియా స్థాయిలో రష్మిక మందన్నకు భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ కన్నడ భామ తన పారితోషికాన్ని (Rashmika Mandanna Remuneration) పెంచినట్లు తెలుస్తోంది. పుష్ప పార్ట్ వన్ కోసం రష్మిక రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. పార్ట్ 2 కోసం కోటి రూపాయల రెమ్యూనరేషన్ పెంచి.. మూడు కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమెకి ఉన్న ఫాలోయింగ్ కారణంగా నిర్మాతలు అంత మొత్తం ఇవ్వడానికి ఒకే అన్నారట. 

Also Read: MS Dhoni - Haris Rauf: ఎంఎస్ ధోనీ స్పెషల్‌ గిఫ్ట్‌.. భావోద్వేగానికి గురైన పాకిస్తాన్ క్రికెటర్‌! మహీ మాటిస్తే అంతేమరి!!

మొత్తానికి 'పుష్ప' పార్ట్ 2కి (Pushpa Second Part) రష్మిక మందన్న రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నారు. రష్మిక కెరీర్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ ఇదే. పుష్ప రెండవ భాగం ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళుతుందని డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 2022 చివరి నాటికి థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల పరంగా చాలా బిజీగా ఉంటున్నారు. తెలుగులో శర్వానంద్ సరసన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో నటిస్తోన్నారు. అలానే బాలీవుడ్‌లో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు కూడా హిట్ అయితే రష్మిక రేంజ్ మరింత పెరగడం ఖాయం. 

ప్రతి సినిమాలో తన పాత్ర ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్త పడుతున్న రష్మిక మందన్న ఖాతాలో మరో సినిమా కూడా ఉందని సమాచారం తెలుస్తోంది. కన్నడ భామ మరో బిగ్ బడ్జెట్ కామెడీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయ‌న్ ఓ డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 'జాతి ర‌త్నాలు' సినిమాతో మంచి హిట్ కొట్టిన అనుదీప్ కేవీ.. శివ కార్తికేయ‌న్‌ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కథ నచ్చడంతో రష్మిక వెంటనే ఒకే చెప్పారని సమాచారం. 

Also Read: Shyam Singha Roy on OTT : ఓటీటీలో శ్యామ్‌ సింగరాయ్‌.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News