New Villian in Pushpa the Rule: పుష్ప 2 కోసం సుకుమార్ నయా ప్లాన్.. రంగంలోకి పవర్ ఫుల్ విలన్!

Sukumar to Rope in one more Powerfull Villian in Pushpa the Rule: పుష్ప సినిమా రెండో భాగం కోసం మరో పవర్ ఫుల్ విలన్ ను రంగంలోకి దింపుతున్నారని టెక్ వినిపిస్తోంది. ఆ వివరాలు 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2022, 10:07 AM IST
New Villian in Pushpa the Rule: పుష్ప 2 కోసం సుకుమార్ నయా ప్లాన్.. రంగంలోకి పవర్ ఫుల్ విలన్!

Sukumar to Rope in one more Powerfull Villian in Pushpa the Rule: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా రెండో భాగం పుష్ప ది రూల్ మీద ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండో భాగం ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి భాగంలో కనిపించిన దాదాపు అందరూ నటీనటులు కూడా రెండో భాగంలో కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రెండో భాగంలో మరింత పవర్ఫుల్ విలన్ కోసం సుకుమార్ ప్లాన్ చేశాడని తాజాగా వెలుగులోకి వచ్చింది.

నిజానికి మొదటి భాగంలో పుష్ప ది రైజ్ లో సునీల్, అనసూయ, అజయ్, అజయ్ ఘోష్, ఫహద్ ఫాజిల్ లాంటి వారు పుష్ప రాజు క్యారెక్టర్ కి ఆపోజిట్ గా ఉండే పాత్రలో నటించారు. వీళ్ళందరూ కూడా పుష్పరాజుకు ఏదో ఒక సమయంలో ఎదురు తిరిగే వ్యక్తులుగా కనిపించారు. ఇప్పుడు మరో నెగిటివ్ క్యారెక్టర్ని రెండో భాగంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మొదటి భాగంలో రావు రమేష్ ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించారు.

సునీల్ బావమరిదిని చంపిన తర్వాత అల్లు అర్జున్ కి రావు రమేష్ సపోర్ట్ చేస్తారు. తద్వారా శాండిల్వుడ్ స్మగ్లింగ్ సిండికేట్ మొత్తాన్ని ఆయనే నడిపేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే రెండో భాగంలో మరో కొత్త రాజకీయ నాయకుడి క్యారెక్టర్ తెరమీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రావు రమేష్ అల్లు అర్జున్ ద్వయాన్ని ఎదుర్కొనే వ్యక్తిగా అతనిని  చూపించే అవకాశం ఉందంటున్నారు. ఆది పినిశెట్టి లాంటి బలమైన విలన్ కోసం సుకుమార్ వెతుకులాట ప్రారంభించారని, వారిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసిన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు, నిజానికి విజయ్ సేతుపతి రెండో భాగంలో నటింప చేస్తారని ప్రచారం చాలా కాలం నుంచి జరుగుతోంది.

ఇప్పుడు ఆది పినిశెట్టి లాంటి వారిని కూడా సంప్రదిస్తున్నారని టాక్ రావడంతో అసలు ఎవరిని రెండో భాగానికి తీసుకుంటున్నారు అనే విషయం మీద చర్చ జరుగుతోంది. ఇక రెండో భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో పూర్తి చేసి దసరా 2023కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని కూడా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండో భాగంలో కూడా రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించబోతోంది.

Also Read: NBK 107 plot twist revealed: ఎన్బీకే 107 మూవీ కథ ప్లాట్ లీక్..అసలు కథ దాని చుట్టూనే!

Also Read: SSMBxSitaraForDIDTelugu: జీ తెలుగు డాన్స్ ఇండియా డాన్స్ లో మహేష్ సందడి.. సితార కూడా వచ్చేసిందిగా!

Trending News