Pushpa 2 High Court: 'పుష్ప 2' చూడాలంటే రూ.10 వేలు ఖర్చు చేయాల..? తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

Telangana High Court Objection On Pushpa 2 The Rule Ticket Price Hike: అడ్డగోలుగా సినిమా ధరలు పెంచుకోవడానికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అనుమతించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టారాజ్యంగా ధరలు పెంచితే సామాన్యుడు సినిమా ఎలా చూస్తాడని ప్రశ్నించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 3, 2024, 02:59 PM IST
Pushpa 2 High Court: 'పుష్ప 2' చూడాలంటే రూ.10 వేలు ఖర్చు చేయాల..? తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

Telangana High Court: భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2: ది రూల్‌ సినిమాకు తెలంగాణ హైకోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. సినిమా ధరలు పెంచుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అడ్డగోలుగా సినిమా ధరలు పెంచుకోవడాన్ని తప్పుబట్టింది. ఇలా అయితే సామాన్యుడు సినిమా ఎలా చూస్తాడని ప్రశ్నించింది. సినిమా ధరలు పెంచడంతోపాటు బెనిఫిట్‌ షోలు వేసుకోవడంపై నిలదీసింది. ఈ సందర్భంగా చిత్రబృందానికి అక్షింతలు వేసింది. వెంటనే వివరాలు తెలపాలని నిర్మాతలకు ఆదేశించింది.

Add Zee News as a Preferred Source

Also Read: Allu Arjun: ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఏడ్చేసిన అల్లు అర్జున్, సుకుమార్.. అభిమానులు కూడా కన్నీళ్లు

 

పుష్ప 2 సినిమా ధరలు పెంచడం.. బెనిఫిట్‌ షోలు వేసుకోవడంపై సోమవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చిత్రబృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బెనిఫిట్ షో ఎవరి బెనిఫిట్ కోసం' అంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి వాదించారు. 'బెనిఫిట్ షో ద్వారా వచ్చిన డబ్బులు ఎస్క్రో అకౌంట్‌లో పెట్టాలి' అని డిమాండ్‌ చేశారు.

Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'

 

ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ న్యాయవాది సిద్దార్థ్ స్పందిస్తూ 'రెండు వారాలు సమయం కావాలి' అని కోరగా.. 'రెండు వారాలు అంటే సినిమా బెనిఫిట్ షో, సినిమా రిలీజ్ అయిపోతుంది' అంటూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి ప్రతి వాదనలు చేశారు. సాయంత్రం ఆర్డర్ ఇస్తానంటూ జస్టిస్ విజయ్ సేన్ రెడీ బెంచ్ తెలిపింది. 'రూ.800 పెట్టీ సామాన్యుడు ఎలా సినిమా చూస్తాడు. ఓ కుటుంబం నుంచి 10 మంది సినిమాకు వెళ్తే రూ.10 వేలు ఖర్చు చేయాల?' అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. 'బెనిఫిట్ షో అర్ధ రాత్రి 1 గంటలకు పెట్టడం ఏమిటి' అని ప్రశ్నిస్తూనే దీనివలన 'చిన్న పిల్లల ఆరోగ్యం దెబ్బ తింటుంది' అని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది. తుది తీర్పు ఇంకా వెలువడలేదు. కాగా హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. దీనికితోడు సినిమా ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా న్యాయస్థానం నోటీసులు పంపే అవకాశం ఉంది. ప్రతివాదులుగా ప్రభుత్వం, చిత్ర నిర్మాతలకు ధర్మాసనం నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News