శ్రీనివాస కళ్యాణం ప్రమోషన్స్: మొన్న మహేష్ బాబు.. ఇప్పుడు వెంకీ వంతు

Last Updated : Aug 4, 2018, 08:05 PM IST
శ్రీనివాస కళ్యాణం ప్రమోషన్స్: మొన్న మహేష్ బాబు.. ఇప్పుడు వెంకీ వంతు

శతమానంభవతి సినిమా ఫేమ్ సతీశ్ వేగేశ్న డైరెక్ట్ చేసిన శ్రీనివాస కళ్యాణం ఈ ఆగస్టు 9న థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది ఆ మూవీ యూనిట్. నితిన్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాకు విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ అందించినట్టు శ్రీనివాస కళ్యాణం యూనిట్ స్పష్టంచేసింది. వెంకీ వాయిస్ ఓవర్‌తో ప్రారంభయ్యే తమ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందని యూనిట్ తెలిపింది. శ్రీనివాస కళ్యాణం సినిమాను నిర్మించిన దిల్ రాజు వెంకీ తర్వాత సినిమా 'F2'ను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దిల్ రాజు విజ్ఞప్తికి ఓకె చెబుతూ వెంకీ తన వాయిస్ ఇవ్వడానికి అంగీకరించినట్టు సమాచారం.

ఇప్పటికే శ్రీనివాస కళ్యాణం ఆడియో మార్కెట్‌లో సందడి చేస్తుండగా ఇటీవలే మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజైన ట్రైలర్ ఆడియెన్స్‌ని మరింత ఆకట్టుకుంది. మహేష్ బాబు ఇచ్చిన బూస్టింగ్‌కి తోడు ఇప్పుడు వెంకీ ఇస్తున్న వాయిస్ ఓవర్ బూస్టింగ్ శ్రీనివాస కళ్యాణం సినిమాకు మరింత ప్లస్ పాయింట్ కానుందని యూనిట్ ఆశాభావం వ్యక్తంచేస్తోంది.

 

Trending News