Vijay Sethupathi in Pushpa 2: భలే ప్లానేసిన పుష్ప టీం.. ఈసారి విజయ్ సేతుపతి మిస్సవ్వకుండా!

Vijay Sethupathi in Pushpa 2: పుష్ప సీక్వెల్ ను గట్టిగా ప్లాన్ చేస్తున్న సుకుమార్ అండ్ కో విజయ్ సేతుపతిని రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. దాని వెనుక ఒక ఆసక్తికరమైన రీజనే ఉందని అంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2022, 07:53 PM IST
  • పుష్ప2లో విజయ్ సేతుపతి ఎంపికయ్యాడు అంటూ టాక్
  • ఆ విషయంలో కొత్త లాజిక్ తెర మీదకు
  • గట్టిగా ప్లాన్ చేసిన పుష్ప 2 టీం
 Vijay Sethupathi in Pushpa 2: భలే ప్లానేసిన పుష్ప టీం.. ఈసారి విజయ్ సేతుపతి మిస్సవ్వకుండా!

Vijay Sethupathi to star in Pushpa the rule: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా మొదటి భాగం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో రెండో భాగం మీద దర్శకనిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంకా రెండో భాగం షూటింగ్ మొదలు కాలేదు కానీ అప్పుడే సినిమాకి సంబంధించి అనేక ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో రష్మిక పాత్ర చంపేస్తారంటూ ప్రచారం జరగగా ఇంకా స్క్రిప్ట్ కూడా పూర్తి కాలేదని ఆ వార్తల్లో నిజం లేదని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే రెండో భాగంలో విజయ్ సేతుపతిని కూడా తీసుకోబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది.

నిజానికి పుష్ప సినిమా మొదటి భాగం తెరకెక్కిస్తున్న సమయంలోనే విజయ్ సేతుపతిని ఒక కీలక పాత్ర కోసం తీసుకుంటారని ప్రచారం జరిగింది. దానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అప్పటికే ఉప్పెన సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు బాగా క్లోజ్ అయిన విజయ్ సేతుపతి పుష్ప సినిమా కూడా చేస్తానని మాట ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన తమిళ సినిమాల డేట్ లకు ఈ సినిమా డేట్ లకు ఇబ్బంది కలగడంతో తాను సినిమాలో చేయలేని తప్పుకోవడంతో ఆయన స్థానంలో ఫహద్ ఫాసిల్ ను తీసుకొచ్చారు అనేది అప్పట్లో జరిగిన ప్రచారం. అయితే ఇప్పుడు మరోసారి ఇదే విధమైన ప్రచారం జరుగుతోంది. 

అదేమిటంటే శేషాచలం అడవులలో ఎక్కువగా తమిళం స్మగ్లర్లే ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కాబట్టి తమిళనాడు వాసులకు కూడా సినిమా మీద సహజంగానే ఆసక్తి ఏర్పడుతుంది. కానీ మొదటి భాగంలో తమిళనాడు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేందుకు తమిళనాడు నుంచి మంచి స్టార్ ఫేస్ ఏదీ లేదని అంటున్నారు. రెండో భాగాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో సౌత్ లో అన్ని రాష్ట్రాలకు చెందిన స్టార్లను సినిమాలో భాగం చేస్తే కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారట నిర్మాతలు.  అందులో భాగంగానే విజయ్ సేతుపతితో ఒక మంచి పాత్ర చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేయగా దానికి సుకుమార్ కూడా బావుంటుందని చెప్పడంతో ఇప్పుడు విజయ్ సేతుపతిని రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నారట. 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో మంచి అనుబంధం ఉన్న కారణంగా విజయసేతుపతి కూడా ఈసారి సినిమా ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. ఒకసారి ఎలాగో మిస్ అయ్యాం కాబట్టి రెండోసారి మిస్ అవ్వకుండా ప్లాన్ చేస్తానని ఆయన మాట ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఇక ప్రస్తుతానికి సుకుమార్ శిష్యులు సినిమాకు సంబంధించిన ఆడిషన్స్ పనుల్లో బిజీగా ఉండగా సుకుమార్ మరో టీంతో కథను తుది రూపు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అని తెలుస్తోంది. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది సినిమా యూనిట్ స్పందించి ఒక అధికారిక క్లారిటీ ఇస్తే తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితి.

Also Read: Telugu movies this week: ఈ వారం థియేటర్‌స్, ఓటీటీలలో రిలీక్ అయ్యే సినిమాలివే!

Also Read: F3 Movie OTT & Collections: F3 సినిమా భారీగా కలెక్షన్లు, ఓటీటీలో విడుదల ఎప్పుుడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x