నటసింహంపై గురి పెట్టిన పూరి !!

మొన్నటి వరకు ఇస్మార్ట్ శంకర్ పై పూర్తిగా ఫోకస్ చేసిన మాస్ డైరక్టర్ పూరి.. ఆ ప్రాజెక్టు పూర్తకావడంతో ఇప్పుడు బాలయ్య మూవీ కోసం మంచి కథ అన్వేషణలో ఉన్నాడు.

Last Updated : Jul 18, 2019, 01:24 PM IST
నటసింహంపై గురి పెట్టిన పూరి !!

టాలీవుడ్ లో మోస్ట్  సక్సెస్ ఫుల్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తన నెక్స్ట్  మూవీ నటసింహం బాలయ్యతో తీసే ఆలోచన చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్ లో పబ్లిక్ గా ఎనౌన్స్ చేశాడు కూడా . ఇప్పడు ఎలాగో ఇస్మార్ట్ శంకర్ శంకర్  ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు బాలయ్య మూవీ కోసం పెన్ను చేత పట్టి మొదడుకు పని ఇస్తున్నాడు డైరక్టర్ పూరీ. మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్య కోసం సీరియస్ గా హోం వర్క్ చేస్తున్నాడట.

బాలయ్యతో తీసే తన నెక్ట్స్ మూవీ  గురించి పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ ‘బాలయ్య సినిమా అంటే మాస్ ప్రేక్షకుల్లో చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. ఆయన మూవీకి కథ అల్లాలంటే టైమ్ పడుతుంది.. అందుకే ప్రస్తుతానికి ఆ ప్రిపరేషన్స్ లో ఉన్నానని తెలిపాడు.

బాలయ్య అంటేనే మాస్ హీరో.. అలాంటిది ఆ మాస్ కి స్టైల్ జోడించి ‘పైసా వసూల్’ సినిమా చేశాడు పూరీ . మరి ఈసారి బాలయ్యను ఎలా చూపించాలని ప్లాన్ చేసుకుంటున్నాడో … ఈ సినిమా మరి ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో.. చూడాలి మరి.
 

Trending News