సర్జరీల వల్ల శ్రీదేవి చనిపోలేదు - నెటిజన్లకు ఏక్తా కపూర్ కౌంటర్

Last Updated : Feb 26, 2018, 01:08 PM IST
సర్జరీల వల్ల శ్రీదేవి చనిపోలేదు - నెటిజన్లకు ఏక్తా కపూర్ కౌంటర్

అలనాటి నటి శ్రీదేవి మరణంపై పలు రకాలు పుకార్లు వస్తున్నాయి.  అందంగా కనిపించేందుకు చేయించుకున్న సర్జరీల వల్ల ఆమె మరణించారని పలువురు నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వార్తలపై ప్రముఖ బుల్లి తెర నిర్మాత ఏక్తా కపూర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీదేవి సర్జరీలు చేయించుకోవడం వల్ల చనిపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాటల్లో చెప్పాలంటే... ‘రాక్షసుల్లా మాట్లాడకండి ప్లీస్... నాకు తెలిసిన వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఎటువంటి హృద్రోగ సమస్యలు లేకపోయినా.. ఎలాంటి సర్జరీలు చేయించుకోకపోయినా గుండెపోటు వస్తుంది. చావుపుట్టుకలు విధి నిర్ణయిస్తుంది. మీరు ఏవేవో ఊహించుకోవద్దు. ధృడమైన మహిళల హృదయాలు బలహీనంగానే ఉంటాయి’ అని ఏక్తా కాస్త ఎమోషనల్ గా పేర్కొన్నారు.

శ్రీదేవి శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతో చనిపోయారని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. అయితే ఆమె అందంగా కనిపించేందుకు చేయించుకున్న సర్జరీల వల్ల మరణించారని పలువురు నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏక్తాకపూర్ ఈ మేరకు స్పందించారు.

 

 

 

Trending News