రజినీయే ప్రధాని అయితే.. వర్మ ఆసక్తికర ట్వీట్

తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ.

Last Updated : Feb 8, 2018, 10:49 AM IST
రజినీయే ప్రధాని అయితే.. వర్మ ఆసక్తికర ట్వీట్

ఇటీవలి కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ... తాజాగా రజినీకాంత్ పై ఆసక్తికర ట్వీట్ పోస్టు చేశారు. రజినీ ప్రధాన మంత్రి అయితే ఇండియా అమెరికా స్థాయికి చేరుకుంటుంది అంటూ పోస్టు చేశారు.

'ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో ఇండియా కూడా ఒకటి. అదే సూపర్ స్టార్ రజనీ ప్రధాన మంత్రి అయితే ఇండియా కచ్చితంగా అమెరికా స్థాయికి చేరుతుంది. 2.జీరో నుంచి 200.జీరోకు చేరుతుంది’’ అని ట్వీట్‌ చేశారు.

 

రజనీకాంత్‌ గతేడాది రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో వర్మ పై విధంగా స్పందించారు.

Trending News