జాను చిత్రం నుండి మొదటిపాట రేపే విడుదల

ప్రేమ్ కుమార్  దర్శకత్వంలో  దిల్ రాజు నిర్మాణంలో ముస్తాబవుతోన్న శర్వానంద్ .. సమంత జంటగా నటిస్తున్న చిత్రం జాను. ఈ చిత్రం కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుందని చిత్ర యూనిట్ తెలిపింది. 

Last Updated : Jan 20, 2020, 07:45 PM IST
జాను చిత్రం నుండి మొదటిపాట రేపే విడుదల

హైదరాబాద్ : ప్రేమ్ కుమార్  దర్శకత్వంలో  దిల్ రాజు నిర్మాణంలో ముస్తాబవుతోన్న శర్వానంద్ .. సమంత జంటగా నటిస్తున్న చిత్రం జాను. ఈ చిత్రం కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుందని చిత్ర యూనిట్ తెలిపింది. గోవింద్ వసంత సంగీతాన్ని సమకూర్చగా, రేపు సాయంత్రం 5 గంటలకు 'ప్రాణం' అనే సింగిల్ సాంగ్ ను వదలనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 

తమిళంలో హిట్ కొట్టిన '96' మూవీకి ఇది రీమేక్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి పాత్రను శర్వానంద్ పోషిస్తుండగా, త్రిష పాత్రలో సమంత కనిపించనుంది. తమిళ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. వైవిధ్యభరితమైన ఈ సినిమాపట్ల నిర్మాతగా 'దిల్' రాజు ఎంతో నమ్మకంతో వున్నాడు. ఇక శర్వానంద్ - సమంత ఇద్దరూ కూడా ఈ సినిమా తమ కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News