అంబానీ కూతురి మొదటి వివాహ పత్రిక.. సిద్ది వినాయకుడికే..!

రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీతో ఆనంద్ పిరమల్‌కి వివాహం జరగబోతుందనే విషయం తెలిసిందే. 

Last Updated : Oct 30, 2018, 03:46 PM IST
అంబానీ కూతురి మొదటి వివాహ పత్రిక.. సిద్ది వినాయకుడికే..!

రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీతో ఆనంద్ పిరమల్‌కి వివాహం జరగబోతుందనే విషయం తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఇటీవలే డిజైన్ చేశారు. నిన్నటి నుండి వాటిని బంధుమిత్రులకు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆ వివాహ ఆహ్వానానికి సంబంధించి తొలి పత్రికను ముంబయి సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లి.. స్వామివారికి అర్పించినట్లు తెలుస్తోంది. సిద్ధి వినాయకస్వామిని దర్శించుకోవడానికి ముఖేష్, తన సతీమణి నీతా అంబానీ సమేతంగా వెళ్లారు. వారితో పాటు అంబానీ తల్లి కోకిలాబెన్, తనయుడు అనంత్ అంబానీ కూడా దర్శనానికి హాజరయ్యారు.

అంబానీ రాకను పురస్కరించుకొని గుడి బయట భారీగా సెక్యూరిటినీ మోహరించారు. అలాగే కొద్ది గంటలు గుడి షట్టర్లు కూడా మూసేశారు. ఈ సంవత్సరం సెప్టెంబరు నెలలో ఇషా అంబానీకి.. ఆనంద్ పిరమల్‌తో నిశ్చితార్థం జరిగింది. ఇటలీలోని ప్రఖ్యాత లేక్ కోమో ప్రాంతంలో కాబోయే దంపతులిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఆ నిశ్చితార్థ కార్యక్రమానికి ప్రముఖ చలనచిత్ర నటులతో పాటు వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు. 

ఇషా అంబానీ నిశ్చితార్థ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, కరణ్ జోహార్, సోనమ్ కపూర్, జాన్వి కపూర్, ఖుషీ కపూర్ మొదలైన వారంతా హాజరయ్యారు. ప్రియాంక చోప్రా కూడా తన కాబోయే భర్త, హాలీవుడ్ నటుడు నిక్ జోనస్‌తో సహా ఆ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. భారతదేశంలోనే ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన పిరమల్ రియాల్టీ అధినేతైన అజయ్ పిరమల్ కుమారుడైన ఆనంద్ పిరమల్‌తో ఇషా అంబానీకి నిశ్చితార్థం జరిగింది. 

Trending News