కేజీఎఫ్ డైరెక్టర్‌తో ప్రభాస్, మహేష్ బాబు ?

కేజీఎఫ్ డైరెక్టర్‌తో ప్రభాస్, మహేష్ బాబు 

Last Updated : Apr 13, 2019, 11:42 AM IST
కేజీఎఫ్ డైరెక్టర్‌తో ప్రభాస్, మహేష్ బాబు ?

గతేడాది చివర్లో విడుదలై సంచలనం సృష్టించిన కేజీఎఫ్ సినిమాతో అటు సినీ ప్రముఖుల కంట్లో పడటమే కాకుండా ఇటు ఆడియెన్స్ తోనూ శభాష్ అనిపించుకున్న దర్శకుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అక్రమ మైనింగ్ నేపథ్యంతో కన్నడ నటుడు యశ్ హీరోగా రూపొందిన ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ, మళయాళం, హిందీ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో వేర్వేరుగా రెండు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఓ టాక్ వినిపిస్తోంది. 

దిల్ రాజు నిర్మాతగా మహేష్ బాబుతో ఒక సినిమా, మైత్రి మూవీస్ సంస్థ నిర్మాణంలో ప్రభాస్ హీరోగా మరో సినిమాకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడనేది ఆ టాక్ సారాంశం. అయితే, దీనిపై ఎప్పుడూ, ఎవ్వరూ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సీక్వెల్‌తో బిజీగా వున్నాడు, కేజీఎఫ్ సినిమాకు లభించిన ఆధరణ దృష్ట్యా ఈ సీక్వెల్ సినిమాలో సంజయ్ దత్, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నటి రవీనా టాండన్, సౌతిండియాకు సుపరిచితురాలైన రమ్యకృష్ణ వంటి స్టార్ హీరో, హీరోయిన్స్ పలు ప్రధాన పాత్రలు పోషించే అవకాశాలున్నట్టు సినీవర్గాలు చెబుతున్నాయి.

Trending News