శ్రీదేవి కేసు: బోనీ కపూర్ ఆస్తి తగదాలపై ప్రాసిక్యూషన్ ఆరా !

Last Updated : Feb 27, 2018, 02:06 PM IST
శ్రీదేవి కేసు: బోనీ కపూర్ ఆస్తి తగదాలపై ప్రాసిక్యూషన్ ఆరా !

శ్రీదేవి మృతి కేసులో దుబాయ్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు కొనసాగుతోంది.  అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్న ప్రాసిక్యూషన్ ... తాజాగా శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఆస్తి తగదాలపై ఆరా తీసినట్లు తెలిసింది.  దుబాయ్ మీడియా కథనాల ప్రకారం.. మోహిత్ పెళ్లిలో బోనీ కపూర్ మొదటి భార్య బంధువులు శ్రీదేవిని ఏకాకి చేశారు. ఆస్తి విషయంలో బోనీ కపూర్ కూడా మొదటి భార్య కుమారుడి వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీదేవి ..హోటల్ గది నుంచి బయటకు రాలేదు. ఇదే సందర్భంగా ఆమె మరణించడం చర్చ నీయంశంగా మారింది. శ్రీదేవి మనస్తాపానికి ఆత్మహత్యకు పాల్పడిందా.. లేదా హత్యకు గురైందా..లేదా డెత్ సర్టిఫికెట్ లో పేర్కొన్నట్లు ప్రమాద వశాత్తు మరణించిందా అనే కోణాల్లో ప్రాసిక్యూషన్ విచారణ జరుపుతోంది. 

Trending News