Mahesh Babu's Most Expensive New Car: కొత్త కారు కొన్న మహేశ్ బాబు.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

Mahesh Babu's Most Expensive New Car Price @ Rs 5.40 Crore: సూపర్ స్టార్ మహేశ్ కొత్త కారు కొనుగోలు చేశారట. హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ఈ కారు ధర తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం మహేశ్ గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు జక్కన్న సినిమాకు కూడా సైన్ చేశారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 27, 2023, 02:11 PM IST
Mahesh Babu's Most Expensive New Car: కొత్త కారు కొన్న మహేశ్ బాబు.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

Mahesh Babu buys gold Range Rover New car: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ బిజీ బిజీ గడుపుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మరోవైపు జక్కన్న రాజమౌళితో ఓ సినిమాకు సైన్ కూడా చేశారు మహేశ్. వరుస సినిమా షెడ్యూళ్లతో కాల్షీట్లు నింపేసిన మహేశ్.. మరోసారి వార్తల్లో నిలిచారు. రీసెంట్ గా ఆయన ఓ కారును కొనుగోలు చేశారు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

ఇటీవల మహేశ్ గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. దీని ధర దాదాపు రూ.5.40 కోట్లు అని సమాచారం. ఇలాంటి మోడల్ కార్ ఇప్పటికే మహేశ్ తోపాటు చిరంజీవి, మోహన్ లాల్, ఎన్టీఆర్ వంటి స్టార్ల దగ్గర ఉంది. కానీ గోల్డ్ రంగులో ఉన్న రేంజ్ రోవర్ సూపర్ స్టార్ వద్దనే ఉండటం విశేషం. తాజాగా ఈ కారు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

Also Read: Project-K Motion Poster: ప్రభాస్ ‘'ప్రాజెక్ట్ కే'’ మోషన్ పోస్టర్ రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?

ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతుంది. మహేశ్, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై ఎస్. రాదాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాటల మంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది.  ఇందులో మహేశ్ సరసన శ్రీలల నటించనుంది. తొలుత ఈ క్యారెక్టర్ కోసం పూజా హెగ్డే ను సెలక్ట్ చేశారు. ఆమె కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై చిత్ర బృందం ఎటువంటి ప్రకటన చేయలేదు.  కానీ ఆమె స్థానంలో హిట్ బ్యూటీ మీనాక్షి చౌదరిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మహేశ్-రాజమౌళి సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది.

Also Read: Kantara 2 Update: 'కాంతార 2' కోసం ఆ రెండు నేర్చుకుంటున్న రిషభ్ శెట్టి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News