క్వారంటైన్‌ లో ఉన్న మహిళపై ముగ్గురు దుండగుల లైంగిక దాడి ..

రాజస్థాన్ రాష్ట్రంలో క్వారంటైన్‌ లో ఉన్న ఓ మహిళను ముగ్గురు దుండగులు లైంగికదాడి చేశారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాక్ డౌన్ కారణంగా ఓ మహిళ

Last Updated : Apr 26, 2020, 06:27 PM IST
క్వారంటైన్‌ లో ఉన్న మహిళపై ముగ్గురు దుండగుల లైంగిక దాడి ..

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో క్వారంటైన్‌ లో ఉన్న ఓ మహిళను ముగ్గురు దుండగులు లైంగికదాడి చేశారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాక్ డౌన్ కారణంగా ఓ మహిళ రాజస్థాన్‌లోని సవాయి మాదోపూర్ జిల్లాలో చిక్కుకుపోయింది. దేశవ్యాప్తంగా నెల రోజులకు పైగానే గడుస్తున్నప్పటికీ లాక్ డౌన్ ను సడలించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ మహిళ తన స్వగ్రామమైన జైపూర్‌కు కాలినడకన బయలుదేరింది. 

Also Read: రేపు నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

అయితే చీకటికావడంతో బటోడా పోలీస్ స్టేషన్ పరిధీలోని ఓ పాఠశాల వద్ద క్వారెంటేన్ లో ఆగిపోయింది. ఒంటరిగా ఉన్న మహిళను చూసి కామాంధులు ఇదే  అదునుగా భావించిన ఆ ముగ్గురు వ్యక్తులు ఆమెను లైంగికదాడి చేశారని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. కాగా ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ పార్త శర్మ తెలిపారు. మరోవైపు బాధితురాలైన మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించామని, మహిళా ఇచ్చిన సమాచారాన్ని రికార్డ్ చేశామని తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News