బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్..

దేశ రాజధాని డిల్లీలోని జామా మసీద్  ప్రాంతాల్లో విధులు నిర్వహించిన 126వ బిఎస్‌ఎఫ్ బెటాలియన్‌లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 94 మంది బిఎస్‌ఎఫ్ జవాన్లలో

Last Updated : May 8, 2020, 07:35 PM IST
బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్..

ఢిల్లీ: దేశ రాజధాని డిల్లీలోని జామా మసీద్  ప్రాంతాల్లో విధులు నిర్వహించిన 126వ బిఎస్‌ఎఫ్ బెటాలియన్‌లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 94 మంది బిఎస్‌ఎఫ్ జవాన్లలో 75 మందికి కరోనా సోకిందని, ప్రస్తుతం 193 బిఎస్‌ఎఫ్ జవాన్లకు కరోనా వైరస్ సోకగా ఇద్దరు మరణించారు.

మరోవైపు సీఆర్‌పిఎఫ్‌లో 162 మంది జవాన్లకు కరోనా వైరస్ సోకగా ఒకరు మృతి చెందారని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా కరోనాతో ముగ్గురు జవాన్లు చనిపోవడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. కరోనా వైరస్‌ బారిన పడి అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఐటిబిపిలో 82 మంది జవాన్లకు కరోనా వైరస్ సోకగా త్రిపుర (35), కోల్‌కతా (6), ఢిల్లీ(135) మంది జవాన్లకు కరోనా పాజిటివ్ తేలింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ 56,532 మందికి పాజిటివ్ అని తేలగా దాదాపుగా 1900 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో నేడు కొత్తగా 10 కేసులు నమోదు కాగా  ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 1132కు చేరుకోగా 29 మంది మరణించారని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News