విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్...రూ.99కే టికెట్

ఎయిర్ ఏషియా విమన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Last Updated : Jan 16, 2018, 10:22 AM IST
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్...రూ.99కే టికెట్

మలేషియాకు చెందిన విమానయాన సంస్థ ప్రయాణికులకు ఊహించని బంప్ ఆఫర్ ప్రకటించింది. పండగ సీజన్ నేపథ్యంలో రూ.99 కే విమాన టికెట్‌ను అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే నిర్ణీత కాలవ్యవసధిలో మాత్రమే.  ప్రస్తుత మార్కెట్‌ పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌ఏషియా ఈ మేరకు బంపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. అలాగే ఆసియా-పసిఫిక్‌ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు రూ.1,499కే టికెట్‌ అందించనున్నట్లు ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఆఫర్ సంబంధించిన విశేషాలను ఒక్క సారి పరిశీలిద్దాం...

ఆఫర్ విశేషాలు...
* రూ.99 కే విమాన టికెట్‌ (బేస్ ఫేర్ మాత్రమే )
* సోమవారం నుంచి జనవరి 21 వరకు ఈ ఆఫర్‌ కింద టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. 
* టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు జనవరి 15 నుంచి జులై 31 మధ్యకాలంలో ప్రయాణించవచ్చు. 
* ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, పూణె, రాంచీ ప్రాంతాల్లో మాత్రమే ఆఫర్ వర్తింపు
* ఆసియా-పసిఫిక్‌ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు రూ.1,499కే టికెట్‌ 
*  సింగపూర్‌, ఆక్లాండ్‌, బాలి, బ్యాంకాంక్‌, కౌలాలంపూర్‌, మెల్‌బోర్న్‌, సిడ్నీ నగరాలకు ఈ ఆఫర్‌ కింద ప్రయాణించవచ్చు. 

గమనిక: ఎయిర్‌ఏషియా.కామ్‌, ఎయిర్‌ఏషియా మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకునే వారికి మాత్రమే ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. ఎయిర్‌ఏషియా నెట్‌వర్క్‌ లోని ఎయిర్‌ఏషియా ఇండియా,థాయ్‌ ఎయిర్‌ఏషియా,   ఎయిర్‌ఏషియా బెర్హద్‌,  ఎయిర్‌ఏషియా ఎక్స్‌,  ఇండోనేషియా ఎయిర్‌ఏషియా ఎక్స్‌ విమానాల్లోను ఈ ఆఫర్‌ పొందవచ్చు.

Trending News