ఎయిర్ సెల్, మాక్సిస్ కేసు; ఢిల్లీ కోర్టులో చిదంబరంకు తాత్కాలిక ఊరట

                                        

Last Updated : May 30, 2018, 03:51 PM IST
ఎయిర్ సెల్, మాక్సిస్ కేసు; ఢిల్లీ కోర్టులో చిదంబరంకు తాత్కాలిక ఊరట

ఎయిర్ సెల్, మాక్సిస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి చిదరంబానికి  ఢిల్లీ కోర్టు స్పెషల్‌కోర్టు‌లో తాత్కాలిక ఊరట లభించింది. బుధవారం విచారణ ప్రారంభించిన న్యాయస్థానం.. ఈ కేసులో తదుపరి విచారణ జరిగే జూన్ 5 వరకూ చిదంబరంపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవధిలో ఆయన్ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అదే సమయంలో  చిదరంబరం పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై స్పందించాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సూచించింది. 

చిదంబరం తరఫున  సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. కాగా బుధవారం జరిగిన విచారణలో సిబల్ వాదనలు వినిపిస్తూ..తన క్లయింట్ పై అక్రమంగా కేసులు వాదించారు. పోలీసులు తమ క్లయింట్ ను అరెస్ట్ చేయడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారని.. తన క్లయింట్ హక్కుల పరిరక్షణ కోసం ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. న్యాయవాది  కపిల్ సిబల్  వాదనలు విన్న అనంతరం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

ఎయిర్ సెల్, మాక్సిస్ కేసులో విదేశీ పెట్టుబడులను నిబంధనలకు విరుద్ధంగా దేశంలోకి తీసుకు వచ్చారని చిదంబరంపై ప్రధాన ఆరోపణ. అపట్లో ఆర్థికమంత్రిగా ఉన్న ఆయన దీనికి అనుమతించారని అభియోగాలు నమోదైంది.ఈ 800 మిలియన్ డాలర్లు విలువైన ఈ ఒప్పందం తర్వాత చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి కోట్ల రూపాయల ముడుపులు అందాయని కేసు నమోదు చేసిన ఈడీ ఆయన్ను ఇటీవలె అరెస్ట్ చేసింది. ఆయనకు చెందిన కోటిన్నర విలువైన ఆస్తిని కూడా అటాచ్ చేసింది.

Trending News